Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనావైరస్ అంతరించాలని నెలరోజుల పాటు తిరుమలలో సుందరకాండ..? (Video)

కరోనావైరస్ అంతరించాలని నెలరోజుల పాటు తిరుమలలో సుందరకాండ..? (Video)
, మంగళవారం, 7 జులై 2020 (18:23 IST)
కరోనా వైరస్ నుంచి బయటపడాలని ఎంతోమంది దేవుళ్ళను ప్రార్థిస్తున్నారు..పూజలు కూడా చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో గత నెల 11వ తేదీన ధన్వంతరి యాగం మహామంత్రం ప్రారంభించారు. ప్రతిరోజు కూడా ఆలయం ముందు వేదాలను పఠిస్తూ స్వామివారిని వేడుకున్నారు. 
 
నేటితో మహామంత్రం పూర్తి కావడంతో తిరుమల టిటిడి అదనపు ఈఓ ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. సృష్టిలోని సకల జీవరాశులు ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించామని.. సుందరకరాండ ప్రథమ సర్గ సంపూర్ణంగా 211 శ్లోకాలతో అఖండ పారాయణం నిర్వహించినట్లు టిటిడి అదనపు ఈఓ తెలిపారు.
 
తిరుమలలోని నాదనీరాజనం వేదికపై జరిగిన సుందరకాండ ప్రథమ సర్గ అఖండ పారాయణంలో అదనపు ఈఓ పాల్గొన్నారు. ఈ సంధర్భంగా ఈఓ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందినప్పటి నుంచి తిరుమలలోని నాదనీరాజనం వేదికపై యోగవాశిష్టం.. శ్రీ ధన్వంతరి మహామంత్రంను 62 రోజుల పాటు పారాయణం చేసినట్లు చెప్పారు.
 
ప్రపంచాన్ని కరోనా నుంచి రక్షించేందుకు ప్రముఖ పండితుల సూచనల మేరకు జూన్ 11వ తేదీ నుంచి సుందరకాండ పారాయణం ప్రారంభించామన్నారు. ఇందులోని శ్లోకాలను భక్తులతో పలికించి అర్థతాత్పర్యాలతో పాటు ఆ శ్లోక ఉచ్చరణ వల్ల కలిగే ఫలితం, నేటి ఆధునిక సమాజంలోని మానవాళికి ఏ విధమైన సందేశం ఇస్తుందో వివరిస్తూ ప్రతిరోజూ 10 శ్లోకాలను నిరంతరాయంగా పఠించామన్నారు. 
 
అఖండ పారాయణంలో 108 మంది వేదపండితులు, ధర్మగిరి వేద పాఠశాల, ఎస్వీ వేద అధ్యయన సంస్థకు చెందిన వేద విశ్వవిద్యాలయంకు చెందిన శాస్త్రీయ పండితులు పాల్గొన్నట్లు అదనపు ఈఓ చెప్పారు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్త ఆగ్రహానికి ఆమె బూడిదయ్యింది, అలా అరటి వృక్షం వచ్చింది... (video)