Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీవారి లడ్డూల తయారీలో మళ్లీ నందిని నెయ్యి.. టీటీడీ

laddu

సెల్వి

, శుక్రవారం, 6 సెప్టెంబరు 2024 (19:55 IST)
కలియుగ వైకుంఠం, శ్రీవారి లడ్డూల తయారీలో నందిని నెయ్యి వాడకాన్ని నిలిపివేయాలని గత ఏడాది ఆగస్టులో టిటిడి బోర్డు అనూహ్య నిర్ణయం తీసుకుంది. కొన్నేళ్లుగా వాడిన నందిని నెయ్యిని టీటీడీ ఆపి వేసింది. దీంతో తిరుమల లడ్డూల నాణ్యత, రుచిపై కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. 
 
ఈ వ్యవహారంలో ఏపీ మంత్రి నారా లోకేష్ జోక్యం చేసుకున్నారు. ప్రస్తుతం లడ్డూల తయారీకి సంబంధించి టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. తయారీ ప్రయోజనాల కోసం నందిని నెయ్యిని తిరిగి తీసుకురావాలని బోర్డు నిర్ణయించింది. 
 
నాణ్యమైన ఉత్పత్తులకు పేరుగాంచిన కర్ణాటకకు చెందిన నందిని డైరీ సంస్థ నుంచి ఈ నాణ్యమైన నెయ్యి కొనుగోలు చేయనున్నారు. తిరుమల లడ్డూలలో రుచి, నాణ్యత కోసం నందిని నెయ్యిని తిరిగి తీసుకురావాలనే నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ వెల్లడించింది. అయితే లడ్డూల ధరలో ఎలాంటి మార్పు వుండదని తితిదే వెల్లడించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వినాయక చవితి రోజు.. కొబ్బరి నూనె వేసి జిల్లేడు వత్తులతో..?