Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Leopard: శ్రీవారి మెట్టు నడక మార్గంలో చిరుతపులి.. భక్తుల్లో భయం భయం

Advertiesment
Leopard
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే శ్రీవారి మెట్టు నడక మార్గంలో ఒక చిరుతపులి కనిపించడంతో భక్తులు కొంతసేపు భయాందోళనలకు గురయ్యారు. భక్తుల బృందం ఒకటి చిరుతపులిని గమనించి కేకలు వేసింది. సిబ్బంది వెంటనే ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని చిరుతపులి ఆచూకీ కోసం గాలించారు. వారు ఆ ప్రదేశంలో ఉన్న చిరుతపులి పాదముద్రలను పరిశీలించారు. 
 
అటవీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఒక పందిని వేటాడేందుకు  వెళ్తున్న చిరుతపులి అనుకోకుండా శ్రీవారి మెట్టు నడక మార్గంలోని 434వ మెట్టు వద్దకు చేరుకోవడంతో భక్తులలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అప్రమత్త చర్యలు తీసుకున్నామని.. భక్తుల భద్రత దృష్ట్యా మా బృందాలు ఆ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్నాయని తిరుపతి జిల్లా అటవీ అధికారి వి. సాయిబాబా తెలిపారు.
 
భక్తులు రోడ్డు మార్గంలో ప్రయాణించడానికి బదులుగా, అలిపిరి, శ్రీవారి మెట్టు అనే రెండు సాంప్రదాయ మార్గాల ద్వారా నడుచుకుంటూ తిరుమలకు చేరుకుంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

09-01-2026 శుక్రవారం ఫలితాలు - రుణ ఒత్తిడితో మనశ్శాంతి ఉండదు...