గుజరాత్లోని గోల్వాడ జగన్నాథ రథయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. ఊరేగింపులో ఏనుగు ఒక్కసారిగా భక్తులపైకి దూసుకెళ్లింది. భక్తులు భయంతో పరుగులు తీయడం కారణంగా తొక్కిసలాట జరిగింది. పలువురు భక్తులకు గాయాలు అయ్యాయి. వెంటనే వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు.
శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమాల్పూర్లోని జగన్నాథ ఆలయంలో మంగళ హారతి నిర్వహించిన తర్వాత 148వ రథయాత్ర ప్రారంభమైంది. గంటలు, శంఖాలు , జై జగన్నాథ మంత్రాల మధ్య రథాలు వాటి స్థానం నుంచి కదిలిన వెంటనే, పూరీ నగర వాతావరణం అద్భుతమైన, దైవిక శక్తితో నిండిపోతుంది. ఈ చారిత్రాత్మక, ఆధ్యాత్మిక ఉత్సవాన్ని వీక్షించడానికి లక్షలాది మంది భక్తులు పూరీకి చేరుకున్నారు.
ఈ రథయాత్ర 9 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సమయంలో భక్తులు హరే కృష్ణ హరే రామ అని జపిస్తూ రథాలను లాగుతారు. ఈ దైవత్వానికి ఆకర్షితులై విదేశీ భక్తులు కూడా భారీ సంఖ్యలో చేరుతారు. ఈ మహా యాత్ర కోసం మూడు భారీ రథాలను సిద్ధం చేశారు.