Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శేషాచలం అడవుల్లో ఎగిసి పడుతున్న మంటలు

Advertiesment
శేషాచలం అడవుల్లో ఎగిసి పడుతున్న మంటలు
, మంగళవారం, 26 ఏప్రియల్ 2016 (21:09 IST)
శేషాచలం అటవీ ప్రాంతంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. సాయంత్రం 7 గంటలకు కపిల తీర్థం పైనున్న అటవీ ప్రాంతంలో మంటలు వ్యాపించాయి. మెల్లమెల్లగా మంటలు చెలరేగి దట్టంగా అల్లుకున్నాయి. వేడిగాలులు వస్తుండడంతో మంటలు మరింతగా చెలరేగాయి.
 
అయితే మంటలు వ్యాపిస్తున్న ప్రాంతానికి వెళ్లే వీలు లేకపోవడంతో అగ్నిమాపక సిబ్బందితో పాటు టిటిడి అధికారులు చేతులెత్తేశారు. వేసవి కాలం కావడంతో అడవుల్లోని రాళ్ళురాళ్ళు రాసుకుని ఎండిన ఆకులపై పడి మంటలు వ్యాపించినట్లు ఫైర్‌ సిబ్బంది భావిస్తున్నారు. 
 
వాతావరణం చల్లబడిన తరువాత మంటలు దానికదే ఆరిపోతే ప్రమాదం తప్పినట్లే. లేకుంటే అటవీ ప్రాంతం మొత్తం మంటలు వ్యాపిస్తే మూగ జంతువులు ప్రాణాలు కోల్పోయినట్లేనని అటవీ శాఖాధికారులు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

100 స్పీడులో ధనం వస్తుంది, 300 స్పీడులో ధనం పోతుంది(సి.హెచ్. సురేష్ గోపాల్- వరంగల్)