Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమల శ్రీవారికి అజ్ఞాత భక్తుడు రూ.40 కోట్ల విరాళం

తిరుమల వెంకన్నకు కానుకలు కొదవా. ఇంతింతై.. వటుండితై అన్న చందంగా స్వామివారి ఆస్తులు అలా పెరుగుతూనే ఉన్నాయి. స్వామివారికి మ్రొక్కుల రూపంలో కోట్ల రూపాయల డబ్బును భక్తులు సమర్పించుకుంటున్నారు. శ్రీవారిని కో

Advertiesment
తిరుమల శ్రీవారికి అజ్ఞాత భక్తుడు రూ.40 కోట్ల విరాళం
, మంగళవారం, 16 మే 2017 (15:14 IST)
తిరుమల వెంకన్నకు కానుకలు కొదవా. ఇంతింతై.. వటుండితై అన్న చందంగా స్వామివారి ఆస్తులు అలా పెరుగుతూనే ఉన్నాయి. స్వామివారికి మ్రొక్కుల రూపంలో కోట్ల రూపాయల డబ్బును భక్తులు సమర్పించుకుంటున్నారు. శ్రీవారిని కోరికలు కోరి అది నెరవేరిన వెంటనే ఆయనకు ముడుపులు సమర్పిస్తున్నారు. 
 
అలా ఒకటి కాదు రెండు కాదు కోట్ల రూపాయలు సమర్పిస్తున్నారు భక్తులు. స్వామివారిపై భారం వేసిన తర్వాత ఆయన అన్నీ చూసుకుంటారు కాబట్టి ఆయనకు వాటా ఇస్తుంటారు భక్తులు. ఇది మామూలుగా అందరూ చెప్పుకునేదే. అయితే శ్రీనివాసుడు మాత్రం మంచి పనులకు ఎప్పుడూ తోడుగా ఉంటారని పెద్దలు చెబుతుంటారు.
 
తిరుమల శ్రీవారికి ఒక అజ్ఞాత భక్తుడు 40 కోట్ల రూపాయల విరాళాన్ని ఇచ్చాడు. అది కూడా ఎవరికి చెప్పవద్దని అతి రహస్యంగా డబ్బుల రూపంలో తితిదే ఉన్నతాధికారులకు సమర్పించారట. తెలిసి ఇచ్చిన కూడా డబ్బుకు ఎలాంటి పన్ను ఉండదు. కానీ ఎందుకో భయపడిన భక్తుడు మొత్తం డబ్బును తితిదే ఈఓకు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ డబ్బును భక్తులకు ఉపయోగపడేలా చూడాలని అజ్ఞాత భక్తుడు తితిదేని కోరాడట. మరి ఈ మొత్తాన్ని దేనికి ఉపయోగించాలన్న ఆలోచనలో తితిదే ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాండవుల్లో ధర్మరాజే స్వర్గానికి వెళ్ళారట.. మిగిలిన వారు...?