Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ ఆకుల్లో భోజనం చేయకూడదా...?

ఆహారం తీసుకునేటప్పుడు ముందుగా తీపి తినాలి. పాలుపోసుకున్న తర్వాత పెరుగు పోసుకోకూడదని బ్రహ్మపురాణంలో ఉంది. కాళ్ళు బారచాపుకుని, ఎడమకాలి చేస్తో ముట్టుకుంటూ చెప్పులు వేసుకుని ఆహారం తినకూడదు.

ఆ ఆకుల్లో భోజనం చేయకూడదా...?
, శనివారం, 14 అక్టోబరు 2017 (21:49 IST)
ఆహారం తీసుకునేటప్పుడు ముందుగా తీపి తినాలి. పాలుపోసుకున్న తర్వాత పెరుగు పోసుకోకూడదని బ్రహ్మపురాణంలో ఉంది. కాళ్ళు బారచాపుకుని, ఎడమకాలి చేస్తో ముట్టుకుంటూ చెప్పులు వేసుకుని ఆహారం తినకూడదు. 
 
ఎడమచేత్తో తినడంగాని, తాగడం కాని పనికిరాదు. భోజనం చేయడం పూర్తయ్యాక అన్నీ తినకుండా కాస్త కాస్త విడిచిపెట్టాలి. అయితే పెరుగు, తేనె, నేయి, పాలు మాత్రం పూర్తిగా తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. 
 
భాగ్యాన్ని కోరేవారు మఱ్ఱి, జిల్లేడు, రావి, కలిగొట్టు, తుమ్మికి, కానుగు ఆకులు వాడరాదని పైఠీనసివచనం. మోదుగ, తామర గృహస్థులకు పనికి రాదని, సన్యాసులకు పనికొస్తుందని పురాణాలు చెబుతున్నాయి. 
 
అలాగే బంగారం, వెండి, కంచు పాత్రలతో పాటు తామరాకు, మోదుగాకులను భోజనపాత్రలుగా ఉపయోగించుకోవచ్చు. కంచుపాత్ర గృహస్తులకు మంచిది. భోజనం పాత్రలో వేసేటప్పుడు మొదట నేతిని చూపించాలి. ఆకులమీదగాని, ఇనుపమేకులు వేసిన పీటల మీద కూర్చొని తినడం ఆచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నరక చతుర్ధశి.. దీపావళి రోజున సూర్యోదయానికి ముందే తలంటుకోవాలి..