శివకేశవులు కొలువైన ఆలయం ఏదో.. తెలుసా..?
దేవాలయం అంటేనే మానసిక ప్రశాంతతకు నిలయం. దేవుని మందిరంలో మనసులోని మాటను చెప్పుకోవడంతో భారం తీరినట్లవుతుంది. అలానే దేవుడే తోడుగా ఉన్నాడనే భరోసా కలుగుతుంది. దేవుని దర్శనం, నామ స్మరణ మంచి అనుభూతిని అందిస్
Publish Date: Mon, 24 Sep 2018 (11:26 IST)
Updated Date: Mon, 24 Sep 2018 (12:04 IST)
దేవాలయం అంటేనే మానసిక ప్రశాంతతకు నిలయం. దేవుని మందిరంలో మనసులోని మాటను చెప్పుకోవడంతో భారం తీరినట్లవుతుంది. అలానే దేవుడే తోడుగా ఉన్నాడనే భరోసా కలుగుతుంది. దేవుని దర్శనం, నామ స్మరణ మంచి అనుభూతిని అందిస్తాయి. అందుచేతనే చాలామంది ఆలయ దర్శనాలు చేస్తుంటారు. అటువంటి ఆలయాలలో శివకేశవులు కొలువుతీరిన ఆలయాలు కొన్ని ఉన్నాయి.
శివుడు, శ్రీరామచంద్రుడు కొలువైన ఆలయాలలో ఒకటి హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లోని కమలానగరల్లో స్వామివారు దర్శనమిస్తుంటారు. సోమ, శని వారాల్లో, విశేషమైన పర్వదినాల్లో ఈ ఆలయాలలో భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. ఈ ఆలయ దర్శనం చేయడం వలన మనసులోని కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.