Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమావాస్య రోజున ఈ నియమాలు పాటిస్తే..?

అమావాస్య రోజున ఈ నియమాలు పాటిస్తే..?
, సోమవారం, 27 జూన్ 2022 (22:17 IST)
మన సనాతన ధర్మ ప్రకారం మృతిచెందిన పూర్వీకులు, బంధువులు పితృపక్షం రోజుల్లో అమావాస్య రోజున భూమి పైకి వస్తారని విశ్వాసం. ఆరోజున వారికి శ్రద్ధ, తర్పణం చేయడం ఆచారం.  
 
అమావాస్య (28-06-22) రోజు చనిపోయిన వారికి శ్రాద్ధం నిర్వహిస్తే.. వారి ఆత్మ లకు మోక్షం దక్కుతుందని నమ్మకం. దీంతో వారు వారి కుటుంబాలకు దీవెనలు అందిస్తారని అంటారు. అమావాస్య రోజున కట్టింగ్, షేవింగ్‌ చేసుకోకూడదు.  
 
సూర్యచంద్రులు అమావాస్య రోజు చేరువై ఒకే చోట నివసిస్తారు. అదే రోజునే అమావాస్య అనే పేరు సార్థకం అయ్యింది. ఈ రోజున సూర్య చంద్రులను పూజించడం చేయొచ్చు. అలాగే అమావాస్య రోజున పూజ శుభఫలితాలనే ఇస్తుంది. జీవితంలో సుఖసంతోషాలను ప్రసాదిస్తుంది. 
 
పితృదేవతలు మన శ్రేయస్సును కోరుకుంటారు. కాబట్టి.. అమావాస్య రోజున వారికి పిండ ప్రదానం చేయాలి. లేకుంటే కనీసం నీరైనా వదలాలి. పూజగదిని శుభ్రం చేసుకుని పితృదేవతలకు భోజనాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ అన్నంలో కాస్త కాకులకు వుంచాలి. 
 
ఇలా వుంచడం ద్వారా అమావాస్య రోజున కాకుల రూపంలో పితృదేవతలు మనం వుంచిన ఆహారాన్ని తీసుకుంటారని విశ్వాసం. ఇలా ప్రతి అమావాస్యకు పితృదేవతలు పిండ ప్రదానం చేస్తే ఆ ఇంట శుభం జరుగుతుంది. 
 
పితృదేవతలు దేవతాగణంలో ఏడు విభాగాలుగా వుంటారట. పితృదేవతలను సుఖంగా వుంచుకుంటే.. తప్పకుండా అష్టైశ్వర్యాలు లభిస్తాయి. అందుకే అమావాస్య రోజున మధ్యాహ్నం 12 గంటల్లో పితృదేవతలను పూజించి వారికి శ్రాద్ధం ఇవ్వాలని పండితులు సెలవిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూలై 12 తిరోగమన శని సంచారం.. ఈ రాశుల వారికి భలే అదృష్టం..