"శమీ శమయతే పాపం శమీశతృవినాశినీ 1
అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ" 2
విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత జమ్మిచెట్టు వద్ద గల అపరాజితాదేవిని పూజించి పై శ్లోకంతో స్మరిస్తూ... జమ్మిచెట్టును ప్రదక్షిణం చేయాలి. తర్వాత పై శ్లోకం రాసుకున్న చీటీలను ఆ చెట్టు కొమ్మలకు తగిలించాలి. ఇలా చేయడం ద్వారా కోరిక కోర్కెలు నెరవేరి...అమ్మవారి కృపతో పాటు శనిదోష నివారణ కూడా పొందుతారని ప్రతీతి.
ఇంకా చెప్పాలంటే... శ్రీరామ చంద్రుడు, విజయదశమి, విజయ కాలమందు ఈ శమీ పూజను గావించి లంకపై జైత్రయాత్రను ప్రారంభించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందువలనే హిందువులంతా దీనిని విజయ ముహూర్తంగా భావిస్తారని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.