Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెల్లఆవాలతో ధూపమేస్తే ఏంటి ఫలితం?

తెల్లఆవాలతో ధూపమేస్తే ఏంటి ఫలితం?
, శుక్రవారం, 20 డిశెంబరు 2019 (19:12 IST)
తెల్ల ఆవాలతో యాగం చేయడం ద్వారా దుష్ట శక్తులు ఇంటి నుంచి తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. అంతేగాకుండా ఇంట్లో ధూపాన్ని వేసే సాంబ్రాణిలో తెల్ల ఆవాలు వేస్తే.. ఇంట్లో ప్రతికూల ఫలితాలు సైతం వైదొలగుతాయి. 
 
తెల్ల ఆవాలు, గోరింటాకు గింజలు, సాంబ్రాణి, బిల్వ పత్రాల పొడి, వేపాకు పొడి, గరిక పొడిని కలిపి.. మంగళవారం, గురువారం, ఆదివారం పూట సాంబ్రాణితో కలిపి ధూపమెలిగిస్తే ఇంట్లో ప్రతికూల శక్తులు తొలగిపోయి.. సానుకూల ఫలితాలుంటాయి. కుటుంబంలో ప్రశాంతత చోటుచేసుకుంటుంది. 
 
దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఈ వస్తువులు కాలుకి తగలకుండా జాగ్రత్త పడాలి. ఈ వస్తువులకు దైవాత్మిక శక్తి వుంటుంది. వేపాకు శక్తి మాతకు, గరిక వినాయకునికి ప్రీతికరం. ఇలాంటివి అగ్నిలో వేయడం ద్వారా దుష్ట శక్తులు తొలగిపోతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

20-12-2019 శుక్రవారం మీ రాశి ఫలితాలు (video)