Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేత్ర‌ప‌ర్వంగా ల‌క్ష దీపార్చ‌న‌...

Advertiesment
Laksha Deeparchana
ప‌విత్ర కార్తీక మాసాన్ని పుర‌స్క‌రించుకొని శ‌త‌స‌హ‌స్ర దీపార్చ‌న సేవామండ‌లి ఆధ్వ‌ర్యంలో విజ‌య‌వాడ‌లోని మాకినేని బ‌స‌వ‌పున్న‌య్య స్టేడియంలో శ‌నివారం సాయంత్రం నిర్వ‌హించిన సామూహిక స‌త్య‌నారాయ‌ణ స్వామి వ్ర‌తాలు, ల‌క్ష దీపార్చ‌న కార్య‌క్ర‌మం నేత్ర‌ప‌ర్వంగా సాగింది. 
 
ఈ సంద‌ర్భంగా 300 అడుగుల మ‌హాలింగాన్ని భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో విచ్చేసి శ‌త‌స‌హ‌స్ర దీపాల‌తో వెలిగించి ఆనంద‌ప‌ర‌వ‌శుల‌య్యారు. 300 మంది జంట‌లు పాల్గొని భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో స‌త్య‌నారాయ‌ణ స్వామి వ్ర‌తాన్ని ఆచ‌రించారు. కార్తీక దీపాల కాంతుల‌లో స్టేడియం ప్రాంగ‌ణం ఇల కైలాసాన్ని త‌ల‌పించింది. 
 
ఈ కార్య‌క్ర‌మానికి తాళ్లాయ‌పాలెంలోని శైవ‌క్షేత్రం పీఠాధిప‌తి శివ‌స్వామి పాల్గొని భ‌క్తుల‌కు దీపారాధ‌న యోక్క ప్రాశ‌స్థాన్ని వివ‌రించి అనుగ్ర‌హ‌భాష‌ణం చేశారు. కార్య‌క్ర‌మంలో యాబ‌లూరి లోక‌నాథ‌శ‌ర్మ‌, మాజీ ఎంపీ గోక‌రాజు గంగ‌రాజు, జి.డి.వి.ప్ర‌సాద్‌, నాగ‌లింగం శివాజీ త‌దిత‌రులు పాల్గొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆదివారం (24-11-2019) మీ రాశిఫలాలు