Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శనివారం పూట బూజు దులపడం చేస్తే..? అమ్మవారి ముందు లవంగం..?

శనివారం పూట బూజు దులపడం చేస్తే..? అమ్మవారి ముందు లవంగం..?
, శనివారం, 9 జనవరి 2021 (05:00 IST)
రాజయోగం, అష్టైశ్వర్యాలు లభించాలంటే.. ప్రతి శనివారం ఇలా చేయాలి. ప్రతి శనివారం ఇంట్లో వున్న పగిలిన, విరిగిన వస్తువులను పారేయడం చేయాలి. శనివారం పూట బూజు దులపడం చేస్తే.. ఇంట్లోని ప్రతికూల శక్తి పారిపోతుంది. ధనప్రాప్తి కోసం ఏదైనా అమ్మవారి ఉపాసన చేస్తూ.. అమ్మవారి దగ్గర శుక్రవారం ఒక లవంగాన్ని ఉంచండి.

గృహిణీలు ఎప్పుడూ కంట తడి పెట్టకూడదు. ప్రతిరోజూ పూజలో శ్రీ సూక్తం తప్పకుండా చదవాలి. శుక్రవారం, శనివారం పూజల్లో శ్రీసూక్తం తప్పనిసరి. పూజగదిలో తప్పని సరి ఏకాక్షి కొబ్బరికాయను ఉంచడం ద్వారా ధనప్రాప్తి కలుగుతుంది. 
 
ఉదయం నిద్రలేవగానే రెండు అరచేతులు చూసి నాలుగైదు సార్లు ముఖంపై తిప్పడం వల్ల లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. పొదుపు చేయాలనుకుంటే.. భరణి నక్షత్రం వుండే రోజున చేయాలి.

ఇంట్లో డబ్బు భద్రపరిచే చోట కొన్ని అక్షితలు, నాలుగు లక్ష్మీ గవ్వలు, నాలుగు సురిడి కాయలు, నాలుగు చిన్న ఆకుపచ్చ గాజులు.. శ్రీ సూక్తం చదివి పెట్టడం చేస్తే శుభ ఫలితాలుంటాయి. 
 
చేతిలో డబ్బు నిలవట్లేదంటే.. వచ్చిన లాభంలో పదిశాతం దాన ధర్మాలకు కేటాయించండి. అవసరానికి మించి డబ్బు రానప్పుడు కుల దైవానికి మొక్కులు చెల్లించండి.

వీలైనంత వరకు చిన్న పిల్లలకు స్వీట్లు, చాక్లెట్లు పంచండి. ఉదయం నిద్రలేవగానే పసుపు, ఆకుపచ్చ రంగును కలిగిన ఏదైనా వస్తువును చూస్తే ఐశ్వర్యం చేకూరుతుంది. 
 
జేబులో రెండు లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, సురిడి కాయలు వుంచడం  ద్వారా ధనాదాయానికి లోటుండదు. వాడే పర్సులు ఎరుపు రంగులో వుంటే మంచిది.

ముత్తైదువులు ఎరుపు లేదా ఆకు పచ్చ గాజులు ధరించడం చేయాలి. ఇలా చేస్తే అంతా మంచే జరుగుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చలికాలంలో ఎక్కువ.. వేసవిలో తక్కువగా తులసిని తీసుకుంటే..?