Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నరసింహ జయంతి : పంచామృతంతో అభిషేకం.. పానకం, నేతి దీపం..

నరసింహ జయంతి : పంచామృతంతో అభిషేకం.. పానకం, నేతి దీపం..

సెల్వి

, మంగళవారం, 21 మే 2024 (12:26 IST)
నరసింహ జయంతి వైశాఖ మాసం 14వ రోజున జరుపుకునే ముఖ్యమైన పండుగ. ఈ పండుగ విష్ణువు అవతారమైన నరసింహ భగవానుడి జననాన్ని పురస్కరించుకుని జరుపుకోబడుతుంది. మే 21న సాయంత్రం 4:24 గంటలకు పూజను ప్రారంభించవచ్చు. ఇంకా 7:09 గంటల్లోపు ఈ పూజను పూర్తి చేయాలి.
 
ఈ రోజు ఇంట పానకం సమర్పించి నేతి దీపం వెలిగించాలి. ఇంకా ఆలయంలో పంచామృతంతో నరసింహునికి అభిషేకం చేయించాలి. నరసింహ స్వామి ఆలయాలను సందర్శించాలి. 
 
పురాణాల ప్రకారం విష్ణువు నాలుగో అవతారమైన నరసింహ భగవానుడు కశ్యప ఋషి, అతని భార్య దితికి జన్మించాడు. అతను శక్తి, జ్ఞానం రెండింటినీ ప్రతీక. తన భక్తులను రక్షించడానికి, చెడును నిర్మూలించడానికి నరసింహ భగవానుడు భూమిపై అవతరించాడు. 
 
ఈ పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. ఈ పవిత్రమైన రోజున నరసింహ స్వామిని ఆరాధించడం వల్ల శత్రుభయం వుండదు. భయం తొలగిపోతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

21-05-202 మంగళవారం దినఫలాలు - పెంపుడు జంతువుల పట్ల మెళకువ అవసరం...