Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బుధవారం శ్రీ నృసింహ స్వామి వారి ద్వాదశ నామ స్తోత్రం పఠిస్తే..?

బుధవారం శ్రీ నృసింహ స్వామి వారి ద్వాదశ నామ స్తోత్రం పఠిస్తే..?
, బుధవారం, 3 మార్చి 2021 (05:00 IST)
శ్రీ నృసింహ స్వామి వారి ద్వాదశ నామ స్తోత్రం మహా మహిమాన్వితం, శక్తివంతం. ఈ స్తోత్రాన్ని భక్తిగా పఠిస్తే స్వామివారు మనకు రక్షా కవచంలా ఉండి కాపాడతారు. బుధవారం పూట ద్వాదశ నామ స్తోత్రాన్ని పఠిస్తే.. అతి భయంకర వ్యాధులు రుగ్మతులు నశిస్తాయి, భయం తొలగుతుంది. 
 
శ్రీ నృసింహ ద్వాదశ నామ స్తోత్రం
 
ప్రథమంతు మహాజ్వాలో ద్వితీయం తు ఉగ్రకేసరీ ।
తృతీయం తు వజ్రదంష్ట్రశ్చ చతుర్థం తు విశారదః ॥
 
పంచమం నారసింహశ్చ షష్ఠః కశ్యపమర్దనః ।
సప్తమో యాతుహంతా చ అష్టమో దేవవల్లభః ॥
 
నవమం ప్రహ్లాద వరదో దశమోऽనంత హస్తకః ।
ఏకాదశో మహారుద్రో ద్వాదశో దారుణస్తదా ॥
 
ద్వాదశైతాని నామాని నృసింహస్య మహాత్మనః ।
మంత్రరాజ ఇతి జ్ఞాతం సర్వపాప వినాశనమ్ ॥
 
క్షయాపస్మార కుష్ఠాది తాపజ్వర నివారణం ।
రాజద్వారే మహాఘోరే సంగ్రామే చ జలాంతరే ॥
 
గిరిగహ్వర అరణ్యే వ్యాఘ్ర చోరామయాదిషు ।
రణేచ మరణేచైవ శమదం పరమం శుభమ్ ॥
 
శతమావర్తయేద్యస్తు ముచ్యతే వ్యాధి బంధనాత్ ।
ఆవర్తయత్ సహస్రం తు లభతే వాంఛితం ఫలమ్ ॥
 
ఓం శ్రీ లక్ష్మి నృసింహాయ నమః

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

03-03-2021 బుధవారం దినఫలాలు - నరసింహ స్వామిని ఆరాధించినా సంకల్పం..