జ్యేష్ఠ మాసంలో శుక్ల పక్షంలో పదవ రోజు (దశమి తిథి) నాడు జరుపుకునే పవిత్ర గంగా దసరా పండుగ గురువారంతో ప్రారంభమైంది. ఈ పవిత్రమైన రోజున, దేశవ్యాప్తంగా భక్తులు గంగా నదిలో పవిత్ర స్నానమాచరిస్తారు, ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. దానధర్మాలలో పాల్గొంటారు. గంగా దసరా పండుగను పురస్కరించుకుని శుభం కోసం ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం ద్వారా అదృష్టం వరిస్తుంది.
గంగా దసరాను పురస్కరించుకుని కొన్ని ఆధ్యాత్మికంగా ముఖ్యమైన వస్తువులను ఇంటికి తీసుకురావడం వల్ల శ్రేయస్సును ఆకర్షించవచ్చు. ప్రతికూలతను దూరం చేయవచ్చు. దసరా రోజున గంగా జలాన్ని ఇంటికి తీసుకువచ్చి ఇంటి అంతటా చల్లడం వల్ల ప్రతికూలతలు తొలగిపోతాయి. శాంతి, శ్రేయస్సును ఆహ్వానిస్తుంది.
గంగా దసరాను పురస్కరించుకుని తులసి మొక్కను ఇంటికి తీసుకురావడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని నమ్ముతారు. ఇంట్లో ఇప్పటికే తులసి మొక్క ఉంటే, స్నానం చేసిన తర్వాత నీటిని అందించి, సాయంత్రం తులసీ కోట ముందు నెయ్యి దీపం వెలిగించండి. ఇక గంగా దసరా జూన్ ఆరో తేదీన శుక్రవారం ముగుస్తుంది.