Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆస్ట్రేలియాలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటు

సోమవారం నాడు ఆస్ట్రేలియాలో టీపీసీసీ ఎన్నారై సెల్ ఏర్పాటు చేశారు. సిడ్నీ కేంద్రంగా 50 మంది ఎన్నారైలు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఎన్నారై సెల్ ఏర్పాటు చేసారు. గాంధీ భవన్ (ఇండియా ) నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలువు టీపీసీసీ నేతలు మాట్లాడారు. పీస

ఆస్ట్రేలియాలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటు
, సోమవారం, 8 మే 2017 (15:48 IST)
సోమవారం నాడు ఆస్ట్రేలియాలో టీపీసీసీ ఎన్నారై సెల్ ఏర్పాటు చేశారు. సిడ్నీ కేంద్రంగా 50 మంది ఎన్నారైలు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఎన్నారై సెల్ ఏర్పాటు చేసారు. గాంధీ భవన్ (ఇండియా ) నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలువు టీపీసీసీ నేతలు మాట్లాడారు. పీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి, మాజీ అసెంబ్లీ స్పీకర్ సురేష్ రెడ్డి, ఎన్నారై చైర్మన్ బి వినోద్ కుమార్ రిటైర్డ్ IFS, కల్వకుర్తి ఎమ్మెల్యే  చల్లా వంశీచంద్ రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షులు దాసోజు శ్రవణ్, టీపీసీసీ అధికార ప్రతినిధి మహేష్ కొనగల పలువురు తమ సందేశాన్ని ఇచ్చి స్ఫూర్తినిచ్చారు.
 
వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి విక్రమార్క, ఏఐసీసీ సెక్రెటరీ మధు యాష్కీ ఫోన్ ద్వారా తమ సందేశాన్నిచ్చి సామాజిక సేవలో ముందంజలో  ఉండాలని పిలుపునిచ్చారు. అలాగే లండన్ నుండి ఎన్నారై కో-ఆర్డినేటర్ గంప వేణుగోపాల్ మాట్లాడి తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.
 
డాక్టర్ బి వినోద్ చైర్మన్, మన్యం రాజశేఖర్ రెడ్డిని కన్వీనర్‌గా మేక దేవి ప్రసాద్ రెడ్డి కో-కన్వీనర్‌గా కమిటీ మెంబర్లుగా శ్యామ్ ప్రసాద్, ఇమ్రాన్ మహమ్మద్, ఉదయ్ కిరణ్, రాంబాబు, సంజయ్ గౌడ్‌లను నియమిస్తున్నట్లు ప్రకటించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నవ్వు... మానసిక రోగాలకు ఓ సంజీవని.. ఎన్ని ప్రయోజనాలో?