Publish Date: Fri, 09 Jan 2009 (11:17 IST)
Updated Date: Fri, 09 Jan 2009 (11:17 IST)
కావలసిన పదార్థాలు :
మటన్... అర కేజీ
సోయాకూర... మూడుకట్టలు
ఉల్లిపాయలు... 50 గ్రాములు
అల్లం వెల్లుల్లి... తగినన్ని
నూనె... సరిపడ
పచ్చిమిర్చి... నాలుగు
కారం... ఒక టీస్పూన్
ఉప్పు.... సరిపడా
పసువు... సరిపడా
తయారీ విధానం :
మటన్ను చిన్న ముక్కలుగా చేసుకుని వాటికి ఉప్పు, పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి కలిపి బాగా ఉడికించాలి. మరో గిన్నెలో నూనెను మరిగించి, సన్నగా తరిగిన సోయా కూరను వేసి వేయించాలి.
తరువాత ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి, ఉడికిన మాసం ముక్కలు వేసి బాగా వేయించాలి. ఆపై దానికి కారం, పసువు, పచ్చిమిర్చి టమోటాలు కలపాలి. కూరలోని తడి మొత్తం బాగా ఇగిరి, పొడి పొడిగా అయిన తరువాత స్టవ్మీద నుంచి దించేయాలి. దీనిని సర్వింగ్ డిష్లో అలంకరించి వడ్డించండి.