పిల్లలకు మేలు చేసే పనీర్ మటన్ గ్రేవీ ఎలా చేయాలి?
పనీర్ మటన్ గ్రేవీ ఎలా చేయాలి?
Publish Date: Mon, 29 Feb 2016 (15:59 IST)
Updated Date: Mon, 29 Feb 2016 (16:02 IST)
పనీర్లోని క్యాల్షియం, మటన్లోని ఐరన్ పిల్లలకు ఎంతో మేలు చేస్తుంది. ఈ రెండింటి కాంబినేషన్లో గ్రేవీ ట్రై చేస్తే ఎలా వుంటుందో చూద్దాం..
కావలసిన పదార్థాలు:
మటన్: అరకిలో
ధనియాలపొడి: టేబుల్స్పూను,
గరంమసాలా: అరటీస్పూను,
కరివేపాకు: 2 రెబ్బలు,
నూనె: 3 టేబుల్స్పూన్లు
ఉల్లిపాయ తరుగు : ఒక కప్పు,
టొమాటో తరుగు : ఒక కప్పు
దోరగా వేయించిన పనీర్ ముక్కలు : ఒకటిన్నర కప్పు
అల్లం వెల్లుల్లి ముద్ద : ఒక టేబుల్ స్పూన్
కారం, ఉప్పు, నూనె : తగినంత
తయారీ విధానం:
ముందుగా మటన్ను శుభ్రంచేసి కాస్త పసుపు, ఉప్పు చేర్చి కుక్కర్లో ఉడికించి పక్కనబెట్టుకోవాలి. బాణలిలో నూనె వేసి కాగాక ఉల్లి తరుగు చేర్చి దోరగా వేయించాలి. ఆ తర్వాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, కారం వేసి రెండు నిమిషాల పాటు వేపుకోవాలి. తర్వాత ఉడికించిన మటన్ ముక్కల్ని చేర్చి.. అందులో ధని లపొడి, సన్నగా కోసిన టొమాటోముక్కలు వేసి కలపాలి.
టొమాటోలు మెత్తబడ్డాక కప్పు నీళ్లు పోసి ముక్క మెత్తబడేవరకూ ఉడికించాలి. మటన్ పూర్తిగా ఉడికి నూనె తేలాక గరంమసాలా వేసి కలపాలి. ఇందులో పనీర్ చేసి ఐదు నిమిషాలుంచి.. చివరగా కొత్తిమీరతో అలంకరించి దించాలి. అంతే పనీర్ మటన్ గ్రేవీ రెడీ అయినట్లే. ఈ గ్రేవీ రోటీలకు, వేడి వేడి అన్నంలోకి మంచి రుచినిస్తుంది.