Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శీతాకాలంలో మిర్చి మంచిదే..

శీతాకాలంలో మిర్చి ఆహారంలో చేర్చుకోవాలంటే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. మిర్చీలో లో-కేలరీలు వుంటాయి. జీవక్రియల వేగాన్ని పెంచుతుంది. ఇతర వంటకాలతో పోలిస్తే మిర్చీవేసి చేసిన వంటకాలు జీవక్రియల వేగాన

Advertiesment
Mirchi
, శుక్రవారం, 29 డిశెంబరు 2017 (17:47 IST)
శీతాకాలంలో మిర్చి ఆహారంలో చేర్చుకోవాలంటే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. మిర్చీలో లో-కేలరీలు వుంటాయి. జీవక్రియల వేగాన్ని పెంచుతుంది. ఇతర వంటకాలతో పోలిస్తే మిర్చీవేసి చేసిన వంటకాలు జీవక్రియల వేగాన్ని 50 శాతం మేర పెంచుతాయి. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే మిర్చీ శరీరంలోని వ్యర్థాలని బయటకు నెట్టేస్తాయి. తద్వారా అనారోగ్య సమస్యలు దరిచేరవు. 
 
కళ్లు, చర్మ ఆరోగ్యానికి మిర్చిలోని విటమిన్‌ సి, బీటాకెరొటిన్‌లు ఎంతగానో ఉపకరిస్తాయి. రక్తహీనత, ఆస్టియోపొరోసిస్‌ ఉన్నవారు తాజా పచిమిర్చిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. మిర్చిల్లోని ఎండార్ఫిన్లు మనలోని ఉద్వేగాలని అదుపులో ఉంచుతాయి.
 
శీతాకాలంలో చికెన్‌తో మిర్చి గ్రేవీ తీసుకుంటే పిల్లల్లో జలుబు దూరం అవుతుంది. దగ్గు నయం అవుతుంది. అలాంటి పచ్చిమిర్చి-చికెన్ గ్రేవీ ఎలా చేయాలంటే.. 
 
కావలసిన పదార్థాలు: 
చికెన్ -అరకిలో, 
పసుపు: చిటికెడు, ఉప్పు: రుచికి సరిపడా, 
నూనె: తగినంత, వెన్న: టేబుల్‌స్పూను, 
మిరియాలపొడి: టీస్పూను, 
గరంమసాలా: టీస్పూను,
పెరుగు: అరకప్పు, 
ఉల్లిపాయ: ఒకటి, కరివేపాకు: రెబ్బ
 
తయారీ విధానం: 
శుభ్రం చేసిన ముక్కలకు మిరియాలపొడి, గరంమసాలా, పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి ఉంచాలి. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు తలా ఓ కప్పు, ఐదు పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి.. వీటిని మిక్సీలో రుబ్బుకుని పక్కనబెట్టుకోవాలి. స్టౌ మీద బాణలి పెట్టి వేడయ్యాక వెన్న లేదా నెయ్యి వేసి ఉల్లి ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత చికెన్‌ ముక్కలు, పచ్చిమిర్చి ముద్ద వేసి బాగా కలుపుతూ పది నిమిషాల పాటు వేపుతూ వుండాలి. తర్వాత పెరుగు చేర్చి చికెన్ ముక్కలు వుడికే దాక వుంచి గ్రేవీ అయ్యాక దించేయాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆహారం తీసుకునేటప్పుడు స్పూన్లు వాడుతున్నారా?