Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆరోగ్యానికి మేలు చేసే కొరమీను కూరను ఎలా చేయాలి?

చేపల పులుసు తెలుగు వారికి మాత్రమే ప్రత్యేకం. చేపలు ఆరోగ్యానికి చాలా మంచిది. చేపలపులుసు అనగానే అందరికి నోరూరిపోతుంది. చికెన్ తరువాత నాన్ వెజ్ ప్రియులు ఇష్టపడేది చేపలనే. కారంగా, పుల్లపుల్లగా, కమ్మగా ఉండ

ఆరోగ్యానికి మేలు చేసే కొరమీను కూరను ఎలా చేయాలి?
, శుక్రవారం, 17 జూన్ 2016 (16:20 IST)
చేపల పులుసు తెలుగు వారికి మాత్రమే ప్రత్యేకం. చేపలు ఆరోగ్యానికి చాలా మంచిది. చేపలపులుసు అనగానే అందరికి నోరూరిపోతుంది. చికెన్ తరువాత నాన్ వెజ్ ప్రియులు ఇష్టపడేది చేపలనే. కారంగా, పుల్లపుల్లగా, కమ్మగా ఉండే ఈ కొరమీను పులుసు పెట్టడం ఎలాగో ఇప్పుడు చూద్దాం...
 
కావలసిన పదార్థాలు:
కొరమీను చేపలు - 1 కిలో
ఉల్లిపాయలు - 2 కప్పులు తరిగినవి
పసుపు - చిటికెడు
ఉప్పు - తగినంత
నూనె - కావలసినంత
కారం - రుచికి సరిపడా
అల్లంవెల్లుల్లి పేస్ట్‌ - తగినంత
పచ్చిమిరపకాయలు - 3
ధనియాల పొడి - 1/4 టీ స్పూను
గరం మసాలా - 1/4 టీ స్పూను
కొత్తిమీర , కరివేపాకు రెబ్బలు
 
తయారీ విధానం : 
కొరమీను చేపను కడిగి శుభ్రం చేసుకోవాలి. దానిలో తగినంత కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, అల్లంవెల్లుల్లి పేస్ట్‌, గరం మసాలా వేసి 20 నిమిషాలపాటు నానబెట్టాలి. ఆ తర్వాత గ్యాస్ వెలిగించి ఓపాత్ర పెట్టి అందులో నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలను వేసి వేయించుకోవాలి. బాగా వేగాక చేప ముక్కలు కూడా చేర్చి 2 నిమిషాలు వేయించి తగిన నీళ్లు పోసి మూత పెట్టి సన్నని మంట మీద ఉడికించాలి. 
 
చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి రెండు నిమిషాల తరువాత దించెయ్యాలి. చల్లారిన తరువాత ఇంకా రుచిగా ఉండే ఈ పులుసు రెండు రోజులైనా అదే రుచితో ఘుమఘుమలాడుతూ ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లికాకముందు యువకులు.. పెళ్లయ్యాక మహిళలు... పోర్న్ సైట్స్ వీక్షణలో టాప్