Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నవరాత్రి ఉపవాసాల్లో రాక్ సాల్ట్‌ను ఎందుకు ఉపయోగిస్తారంటే?

నవరాత్రి ఉపవాసాల్లో రాక్ సాల్ట్‌ను ఎందుకు ఉపయోగిస్తారంటే?
, ఆదివారం, 10 అక్టోబరు 2021 (16:44 IST)
Rock Salt
ఉప్పు మన ఆహారంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మరియు జీర్ణక్రియను మెరుగుపరచడంలో గ్రేట్‌గా సహాయపడుతుంది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఉపయోగించే వివిధ రకాల ఉప్పులు ఉన్నాయి. భారతదేశంలో, ప్రజలు సాధారణంగా టేబుల్ సాల్ట్, నల్ల ఉప్పు, రాతి ఉప్పును తీసుకుంటారు. 
 
పండుగలు, ఉపవాసాల సమయంలో, ప్రజలు సాధారణ ఉప్పుకు బదులుగా రాతి ఉప్పును ఉపయోగించడానికి ఇష్టపడతారు. దీనికి కారణం ఏంటంటే..? రాతి ఉప్పు గులాబీ-గోధుమ రంగులో ఉంటుంది. దీనిని భారతదేశమంతటా వ్రత వంటకాల్లో ఉపయోగిస్తారు. దీనిని సంస్కృతంలో ‘సైంధవ’ అని అంటారు. 
 
నవరాత్రి సమయంలో, ఇది సాంప్రదాయకంగా రుచికరమైన వంటకాలు చేయడానికి ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇది తేలికగా మరియు సులభంగా జీర్ణమవుతుంది. రాతి ఉప్పు శరీరంలో ఎలక్ట్రోలైట్ల ఆరోగ్యకరమైన సమతుల్యతను కాపాడడంలో సహాయపడుతుంది. బరువును ఇది తగ్గిస్తుంది. 
 
రాక్ సాల్ట్‌లో ఇందులో ఎలాంటి రసాయన భాగాలు లేదా కాలుష్య కారకాలు లేవు. ఆయుర్వేదం ప్రకారం, రాతి ఉప్పు ఆరోగ్యకరమైనది. ఎందుకంటే ఇది వాత, పిత్త, కఫాలను శాంతింపజేస్తుంది. ఇది స్వచ్ఛమైనది మరియు ప్రాసెస్ చేయబడదు. ఇది కూడా ఆవిరైపోలేదు లేదా అయోడైజ్ చేయబడలేదు. 
 
టేబుల్ ఉప్పుతో పోలిస్తే, రాతి ఉప్పు రుచిలో తక్కువ ఉప్పగా ఉంటుంది. ఇందులో పొటాషియం, ఇనుము, జింక్ మరియు మెగ్నీషియం వంటి ఖనిజాలతో నిండినందున టేబుల్ ఉప్పుకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం. రాళ్ల ఉప్పు రక్త ప్రసరణను నియంత్రించడంలో సహాయపడుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

10-10-2021 ఆదివారం దినఫలాలు .. అమ్మవారిని చామంతులతో