Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహిళలు ఇక ఇంటిపేరును మార్చుకోవాల్సిన అవసరం లేదు: మోడీ

మహిళలు ఇక వారి వివాహానంతరం వారి పుట్టింటితో వచ్చిన ఇంటిపేరును పాస్-పోర్ట్ తదితర గుర్తింపు పత్రాల్లో మార్చుకోవలసిన అవసరం లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. భారతీయ మహిళలకు అవకాశమిస్తే పురుషు

మహిళలు ఇక ఇంటిపేరును మార్చుకోవాల్సిన అవసరం లేదు: మోడీ
, శనివారం, 15 ఏప్రియల్ 2017 (09:11 IST)
మహిళలు ఇక వారి వివాహానంతరం వారి పుట్టింటితో వచ్చిన ఇంటిపేరును పాస్-పోర్ట్ తదితర గుర్తింపు పత్రాల్లో మార్చుకోవలసిన అవసరం లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. భారతీయ మహిళలకు అవకాశమిస్తే పురుషుల కంటే ఏ రంగంలోనైనా రెండు అడుగులు ముందు ఉంటారని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. గత మంగళవారం 'ఇండియన్ మహిళల మర్చంట్ వింగు' నుద్ధేశించి వీడియో కాన్-ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు. 
 
ముద్ర, ఉజ్వల వంటి పథకాల ద్వారా మహిళా సాధికారతకు తగు ప్రోత్సాహం తమ ప్రభుత్వమిస్తుందని మోడీ హామీ ఇచ్చారు. అంటే మహిళల అభివృద్దే దేశాభివృద్ది అని బలంగా నొక్కివక్కాణించారు. ప్రతి గృహంలోని ప్రతి మహిళా అభివృద్ది పథకాల్లో ప్రాధాన్యత ప్రాధమ్యాలు సాధికారత ద్వారా సాధించాలన్నదే తమ పార్టీ ప్రభుత్వం రెండూ కలసి కృషి చేస్తాయన్నారు.
 
ఇంతకుముందు ఈ సెలవు 12 వారాలే ఉన్న ప్రసవానంతర సెలవును 26 వారాలుగా మంజూరు చేశారు. ఆసుపత్రిలో ప్రసవానికి అంగీకరించిన ప్రతి మహిళకు రూ.6000/- ఏకమొత్తంగా అందజేస్తుంది. పేదరికానికంటే దిగువన ఉన్న ఐదు కోట్ల మహిళలకు రానున్న రెండేళ్ళలో ఉచిత వంట గాస్ పథకం ద్వారా వంట గ్యాస్ అందిస్తున్నారు. అంతేకాదు, తొలి సంవత్సరమే రెండు కోట్ల లక్ష్యం సాధించారు. దీని కోసం ఉప్పటికే 1.2 కోట్ల మంది స్వతస్సిద్ధంగా వారికి లభిస్తున్న వంట గాస్ సబ్సిడీని వదులుకున్నారని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మద్యం సేవించే నటి హేమమాలిని ఎందుకు ఆత్మహత్య చేసుకోలేదు : మహారాష్ట్ర ఎమ్మెల్యే