Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోడలి వేధింపులు.. భర్తతో పాటు అత్తామామల ఆత్మహత్య.. ఎక్కడ?

కోడలి వేధింపుల కారణంగా.. భర్తతో పాటు అత్తమామలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. పంజాబ్, జలంధర్ నగర్, కిషన్‌పురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే కిషన్ పురానికి చెందిన రామన్ (3

Advertiesment
Woman
కోడలి వేధింపుల కారణంగా.. భర్తతో పాటు అత్తమామలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. పంజాబ్, జలంధర్ నగర్, కిషన్‌పురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే కిషన్ పురానికి చెందిన రామన్ (30) భార్య మోనిక, ఆతని తల్లిదండ్రులను చిత్రహింసలు పెట్టింది. ఈ విషయం తెలుసుకున్న రామన్.. తన తల్లిదండ్రులతో పాటు రైలు ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. 
 
ఈ ముగ్గురు మృతదేహాలను రామ్ నగర్ రైల్వే స్టేషన్ వద్ద కనుగొన్న పోలీసులు.. పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి  కేసు నమోదు చేసుకున్న పోలీసులు రామన్ భార్య వద్ద విచారణ జరుపుతున్నారు. ఈ విచారణలో రామన్ ఎనిమిదేళ్ల క్రితం మోనికను పెళ్లాడినట్లు తెలిసింది. గత రెండేళ్లుగా భర్తతో పాటు.. అత్తమామలను మోనిక హింసించడంతో మనస్తాపంతో ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. రామన్ వెల్డింగ్ షాపు నడుపుతున్నాడని వారు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫ్లైట్ గాల్లో ఉండగా 'అల్లా హు అక్బర్' అంటూ అరిచిన ప్రయాణికుడు... పది నెలల జైలు!