Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కజిన్‌తో వివాహేతర సంబంధం.. భర్త హెచ్చరించినా ఫలితం లేదు.. చివరికి?

కజిన్‌తో వివాహేతర సంబంధం.. భర్త హెచ్చరించినా ఫలితం లేదు.. చివరికి?
, శనివారం, 24 ఏప్రియల్ 2021 (18:19 IST)
మానవీయ విలువలు మంటగలిసి పోతున్నాయి. భార్యాభర్తల సంబంధాలు అంతంత మాత్రంగానే వున్నాయి. వివాహేతర సంబంధాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా వివాహేతర సంబంధం ఒక మహిళ నిండు ప్రాణాన్నిబలిగొంది. 
 
తన కజిన్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యను వద్దని మందలించాడు భర్త. అయినా భార్య లెక్క చేయకుండా ఆ బంధాన్ని కొనసాగించసాగింది. సహనం కోల్పోయిన భర్త, భార్యను గొంతు నులిమి హత్య చేసి పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూరు కార్పోరేషన్ పరిధిలోని తోండముత్తూరులో నివసించే లక్ష్మణ్ రాజ్ (36) శరణ్య(26)లకు ఆరేళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. రెండేళ్లుగా శరణ్య లక్ష్మణ్ రాజ్ కజిన్ యువ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
 
ఇటీవల లక్ష్మణ్ రాజ్ ఈవిషయాన్ని పసిగట్టాడు. వివాహేతర సంబంధాన్ని మానుకోమని భార్యకు నచ్చ చెప్పాడు. అయినా శరణ్యలో మార్పు రాలేదు. దీంతో దంపతులు మధ్య ఇటీవల తరచూ గొడవలు జరుగుతున్నాయి.
 
ఏప్రిల్ 23 శుక్రవారం తెల్లవారు ఝూమున నిద్రపోతున్న శరణ్యను గొంతు నులిమి హత్య చేశాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత సమీపంలోని పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పదిహేనేళ్ల సంసారం గోవిందా.. మరో వ్యక్తితో సహజీవనం.. చివరికి..?