Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అరగంటలోనే కరోనా పరీక్షల రిజల్ట్

అరగంటలోనే కరోనా పరీక్షల రిజల్ట్
, శనివారం, 4 ఏప్రియల్ 2020 (07:32 IST)
కరోనా కేసులు భారీగా పెరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా హాట్​స్పాట్లలో ఈ విధానాన్ని అమలు చేయాలని, ఇలా చేస్తే 15-30 నిమిషాల్లోనే కరోనా ఉందో లేదో తెలుస్తుందని భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)​  స్పష్టం చేసింది.

వైరస్ నిర్ధారణకు యాంటీబాడీ రక్త పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించింది. కొవిడ్​-19 కేసులు వేగంగా పెరుగుతున్న 42 హాట్​స్పాట్​ ప్రాంతాల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్దేశించింది.

ప్రస్తుతం దేశంలో ఆరోగ్య సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో జాతీయ టాస్క్​ ఫోర్స్​ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో భాగంగా హాట్​స్పాట్​ ప్రాంతాల్లో యాంటీబాడీ రక్త పరీక్షలతో కరోనా వైరస్​ను నిర్ధారించాలని అధికారులకు సూచించింది ఐసీఎంఆర్​.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో కరోనా కేసులు 161, ఏ జిల్లాలో ఎంతమంది కరోనా వ్యాధిగ్రస్తులు?