Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగిని లేపేస్తాం...

Advertiesment
narendra modi

ఠాగూర్

, మంగళవారం, 5 మార్చి 2024 (13:50 IST)
వచ్చే ఎన్నికల తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తామని కర్నాటక రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త ఒకరు హెచ్చరించారు. ఆ వ్యక్తిని రాష్ట్రంలోని యాదగిరి జిల్లా రంగంపేటకు చెందిన మొహ్మద్ రసూల్ కడారేగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను బెదిరిస్తూ విడుదల చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ వ్యక్తిని గు్తించారు. 
 
ఫేక్‌బుక్‍‌లో షేర్ చేసిన వీడియోలో రసూల్ మాట్లాడుతూ, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మోడీ, యోగి ఆదిత్యనాథ్‌లను చంపేస్తానని తీవ్రంగా హెచ్చరించారు. అతడి చేతిలో పదునైన ఆయుధం ఉండటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. అది సెల్ఫీ వీడియో అని నిందితుడు ఆ వీడియోలో మోడీ, ఆదిత్యనాథ్‌ను దుర్భాషలాడుతూ కనిపించాడని తెలిపారు. కాగా, రసూల్ హైదరాబాద్ నగరంలో దినసరికూలీగా పని చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైకాపాకు తేరుకోలేని షాక్.. మంత్రి గుమ్మనూరు జయరాం రాజీనామా