Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో 22 రోజుల దసరా సెలవులు...

durgamma as annapurna
, సోమవారం, 29 ఆగస్టు 2022 (12:00 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దసరా సెలవులను ఏకంగా 22 రోజుల పాటు ఇచ్చింది. దుర్గా పూజ నేపథ్యంలో సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 10వ తేదీ నుంచి సెలవులు ప్రకటించింది. పాఠశాలలతో పాటు కార్యాలయలాకు కూడా ఈ సెలవులు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఈ సెలవు రోజుల్లో ఎలాంటి కార్యకలాపాలు జరగవని పేర్కొంది. అంతేకాకుండా, దుర్గాపూజ జరిగే నెలలో 22వ రోజులు సెలవులు తీసుకునే వెసులుబాటును కల్పించింది. 
 
మరోవైపు, ఈ హాలిడేస్‌లో ఒడిషా రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. ఏకంగా 34 రోజుల సెలవులు మంజూరు చేసింది. ఆ తర్వాత జార్ఖండ్ రాష్ట్రంలో 33 రోజులు, అస్సాం, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో 32 రోజులు, తెలంగాణ, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో 28 రోజులు సెలవు ఇచ్చాయి.
 
అయితే, బెంగాల్ రాష్ట్రంలో ఈ 28 రోజుల పబ్లిక్ హాలిడేస్‌తో పాటు దసరా, దుర్గాపజూ సందర్భంగా ఇస్తున్న సెలవులు కూడా అదనం. ఇకపోతే, దేశంలో అతి తక్కువ సెలవులు ఇస్తున్న రాష్ట్రాల్లో ఢిల్లీ, ఆ తర్వాత బిహార్ రాష్ట్రాలు ఉన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రక్తదానం చేసిన శునకం ... ఎక్కడ?