Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మంత్రిగారి పైత్యం... వర్షం కోసం కప్పలకు పెళ్లి.. శోభనం ఎపుడంటున్న నెటిజన్లు..

దేశంలో వరుణదేవుడు కరుణించాలని కోరుతూ ఓ మంత్రిగారు రెండు కప్పలకు పెళ్లి చేశాడు. ఈ కప్పల పెళ్లి చూడటానికి పెద్దఎత్తున అ ప్రాంత ప్రజలు రావడం గమనార్హం. పైగా, ఈ పెళ్లి అంగరంగ వైభవంగా నిర్వహించి, మంచి విందు

మంత్రిగారి పైత్యం... వర్షం కోసం కప్పలకు పెళ్లి.. శోభనం ఎపుడంటున్న నెటిజన్లు..
, ఆదివారం, 24 జూన్ 2018 (16:43 IST)
దేశంలో వరుణదేవుడు కరుణించాలని కోరుతూ ఓ మంత్రిగారు రెండు కప్పలకు పెళ్లి చేశాడు. ఈ కప్పల పెళ్లి చూడటానికి పెద్దఎత్తున అ ప్రాంత ప్రజలు రావడం గమనార్హం. పైగా, ఈ పెళ్లి అంగరంగ వైభవంగా నిర్వహించి, మంచి విందు భోజన కూడా పెట్టారు. శుక్రవారం జరిగిన ఈ కప్పల పెళ్లి వివరాలు, ఈ పెళ్లిని నిర్వహించిన మంత్రివర్యుల వివరాలను తెలుసుకుందాం.
 
మధ్యప్రదేశ్ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి లలితా యాదవ్ కొనసాగుతున్నారు. ఈమె వర్షాలు పడాలని కోరుతూ శుక్రవారం రెండు కప్పలకు వివాహం జరిపించారు. సహచర బీజేపీ నేతలతో కలిసి లలితా యాదవ్ అసద్ ఉత్సవ్ పేరుతో చత్తర్‌‌పూర్‌‌లోని ఓ గుడిలో ఈ కప్పల వివాహ కార్యక్రమాన్ని జరిగింది. 
 
ఇందులోభాగంగా లలితా యాదవ్ పూజరి బ్రిజనందన్ ఆధ్వర్యంలో ఓ గుడిలో రెండు కప్పలకు పెళ్లి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పెళ్లిని చూసేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు అక్కడికి వచ్చారు. అంతేకాకుండా ఈ పెళ్లికి బ్యాండ్ బాజాలు కూడా ఏర్పాటు చేశారు. పెళ్లి తర్వాత విందుభోజనాలు కూడా వడ్డించారు. పెద్ద పండుగలా ఈ కప్పల పెళ్లి  కార్యక్రమం జరిగింది.
webdunia
 
ఈ కప్పలపై నెటిజన్లు తలోరకంగా స్పందిస్తున్నారు. కప్పలకు పెళ్లి చేశారు సరే వాటికి శోభన కార్యక్రమం ఎప్పుడు జరిపిస్తారో చెప్పండంటూ మంత్రిగారిపై నిటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. వాటిని హనీమూన్‌కి ఊటీకి పంపిస్తారా లేక విదేశాలకు పంపిస్తారా అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబుకు నిజాలు.. మాకు అబద్ధాలు చెప్పడం రాదు : కన్నా లక్ష్మీనారాయణ