Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

35కిలో మీటర్లు.. బైకుపైనే అమ్మ మృతదేహం.. పాము కాటేసిందని..?

అనారోగ్యం పాలైతే ఆంబులెన్స్‌లో ఆస్పత్రులకు తీసుకెళ్లలేరు. అలాగే మరణించాక స్వగ్రామాలకు ఆంబులెన్స్‌ల్లో తరలించేందుకు డబ్బుల్లేక మోసుకెళ్లిన ఘటనలు ఎన్నో వున్నాయి. తాజాగా ఓ యువకుడు తన తల్లి మృతదేహాన్ని పో

Advertiesment
Bhopal
, గురువారం, 12 జులై 2018 (13:43 IST)
అనారోగ్యం పాలైతే ఆంబులెన్స్‌లో ఆస్పత్రులకు తీసుకెళ్లలేరు. అలాగే మరణించాక స్వగ్రామాలకు ఆంబులెన్స్‌ల్లో తరలించేందుకు డబ్బుల్లేక మోసుకెళ్లిన ఘటనలు ఎన్నో వున్నాయి. తాజాగా ఓ యువకుడు తన తల్లి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం బైకు మీద 35కిలో మీటర్ల దూరం తీసుకెళ్లాడు.


ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. టికమ్ గఢ్ జిల్లాలోని మస్తాపుర్ గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యువకుడు తల్లి శవాన్ని బైక్‌పై తీపుకెళ్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
ఇంకా ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోస్టుమార్టం కోసం ఆస్పత్రి సిబ్బంది వాహనాన్ని నిరాకరించడంతో తన తల్లి శవాన్ని బైక్‌పై తరలించాడు. మస్తాపూర్‌ గ్రామానికి చెందిన కున్వర్‌ భాయ్‌ అనే మహిళ గత ఆదివారం పాముకాటుకు గురైంది. దీంతో ఆమెను వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టానికి తరలించాల్సిందిగా సూచించారు. 
 
కానీ పోస్టు మార్టం కోసం వాహన సదుపాయాన్ని ఆస్పత్రి సిబ్బంది కల్పించలేదు. దీంతో గత్యంతరం లేక తన బైక్‌పై తల్లి శవాన్ని 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోస్టుమార్టం సెంటర్‌కు తరలించాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో స్పందించిన జిల్లా కలెక్టర్‌ బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
 
పాము కాటేసిన తర్వాత నయమవుతుందనే ఆశతో తన తల్లిని రాజేశ్ ముందు దేవాలయానికి తీసుకెళ్లాడని, ఆ తర్వాతే ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు జిల్లా కలెక్టర్ చెప్పుకొచ్చారు. 108కి ఫోన్ చేసి ఉంటే అంబులెన్స్ వచ్చేదనీ కానీ అలా చేయలేదని వార్తలు వస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోలవరం ప్రాజెక్టు వ్యయం పెరిగిందా? ఎందుకు గడ్కరీ ప్రశ్న.. బాబు ఏమన్నారు?