Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జోరు వర్షంలో బైకుపై చక్కర్లు... ఆపై సబ్బుతో స్నానం

rainbath
, ఆదివారం, 2 జులై 2023 (12:29 IST)
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు అకతాయి కుర్రోళ్లు అల్లరి చేష్టలకు పాల్పడ్డారు. జోరు వర్షంలో బైకుపై చక్కర్లు కొడుతూ సబ్బుతో స్నానం చేశారు. వీరు చేసిన అల్లరి పనులను ఇతర వాహనదారులు మొబైల్ ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ దృశ్యాలు ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఘటన యూపీలోని కాన్పూర్‌లో జరిగింది. 
 
కాగా, ఈ ఘటనపై కాన్పూర్ పోలీసులు స్పందించారు. ఈ ఇద్దరు యువకుల కోసం గాలిస్తున్నట్టు పేర్కొన్నారు. పైగా, వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని కాన్పూర్ పోలీసులు హెచ్చరించారు. 
 
9వ తేదీ వరకు పలు రైళ్ళు రద్దు 
 
సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్ల పరిధిలో ట్రాక్ మరమ్మతు, సిగ్నలింగ్ ఇంజనీరింగ్ పనుల కారణంగా పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. ఈ నెల 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఈ రైళ్ళను రద్దు చేస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. మొత్తం 24 రైళ్ళ సర్వీసులను తత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు పేర్కొంది. అలాగే, లింగంపల్లి, ఫలక్ నుమా, ఉందానగర్, రామచంద్రాపురం మధ్య నడిచే 22 ఎంఎంటీఎస్ సర్వీసులను కూడా రద్దు చేస్తున్నామని, అందువల్ల ప్రయాణికులు సహకరించాలని కోరారు. 
 
కాగా, రద్దు చేసిన రైళ్ల సర్వీసులను పరిశీలిస్తే, కాజీపేట - డోర్నకల్, విజయవాడ - డోర్నకల్, భద్రాచలం - విజయవాడ, విజయవాడ - భద్రాచలం, సికింద్రాబాద్ - వికారాబాద్, వికారాబాద్ - కాచిగూడ, సికింద్రాబాద్ - వరంగల్, వరంగల్ - హైదరాబాద్, సిర్పూర్ టౌన్ - కరీంనగర్, కరీంనగర్ - నిజామాబాద్, కాజీపేట - సిర్పూర్ టౌన్, బల్లార్షా - కాజీపేట, భద్రాచలం - బల్లార్షా, సిర్పూర్ టౌన్ - భద్రాచలం, కాజీపేట - బల్లార్షా, కాచిగూడ - నిజామాబాద్, నిజామాబాద్ - నాందేడ్ ప్రాంతాల మధ్య నడిచే రైళ్ళు ఉన్నాయి. 
 
అలాగే, కాచిగూడ - మహబూబ్ నగర్ మధ్య నడిచే ఎక్స్‌‌ప్రెస్ ఉందానగర్ వరకు, నాందేడ్ - నిజామాబాద్ - పండర్పూర్ ఎక్స్‌ప్రెస్‌ను ముత్కేడ్ వరకు మాత్రమే నడుస్తుందని తెలిపింది. 
 
అదేవిధంగా 22 ఎంఎంటీఎస్ సర్వీసులు కూడా రద్దు చేసింది. వీటిలో లింగంపల్లి - హైదరాబాద్, హైదరాబాద్ - లింగంపల్లి మధ్య నడిచే 10 రైళ్లు, లింగంపల్లి - ఉందానగర్ 3, లింగంపల్లి - ఫలక్ నుమా 2, ఉందానగర్ - లింగంపల్లి 4, ఫలక్ నుమా - లింగంపల్లి 2, రామచంద్రాపురం - ఫలక్ నుమా మధ్య నడిచే ఒక రైలు సర్వీసులు ఉన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్రాక్ మెయింటనెన్స్ పనులు... 9వ తేదీ వరకు పలు రైళ్ళు రద్దు