అహ్మదాబాద్లో గురువారం (జూన్ 12) జరిగిన ఎయిర్ ఇండియా ప్రమాదంలో మరణించిన వారిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఆయన మరణించిన తేదీ ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశమైంది. ఆయన జూన్ 12 (12-06)న మరణించారు. ఈ తేదీకి సంబంధించిన నెంబర్ ఒకప్పుడు ఆయన లక్కీ నెంబర్. ఈ క్రమంలో విజయ్ రూపానీ అన్ని వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్లలో ఒకే సంఖ్య ఉందని చెప్తున్నారు. అయితే, అదే 1206 తేదీన మరణించడంతో ఆయన అదృష్ట సంఖ్య దురదృష్టకరమని తేలింది.
రూపానీకి 1206 నంబర్తో బలమైన సంబంధం ఉందని తెలుస్తోంది. ఆయన వాహనాలన్నింటి నంబర్ ప్లేట్లలో 1206 అని ఉంది. లండన్ వెళ్లే విమానంలో ఆయన సీటు నంబర్ 12, ఆయన బోర్డింగ్ సమయం మధ్యాహ్నం 12:10. ఇది 12 నంబర్తో ఆయనకున్న బలమైన సంబంధాన్ని కూడా చూపిస్తుంది. విచారకరంగా, అదే సంఖ్య గల రోజున ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. 242 మందితో అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం AI 171 టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది.
రూపానీ అదే విమానంలో లండన్లో ఉన్న తన కుమార్తెను కలవడానికి వెళ్తున్నారు. అయితే, రూపానీ ఆ ఘోర ప్రమాదం నుండి బయటపడలేకపోయారు. ఈ ఘోర విమాన ప్రమాదంలో మరణించారు.