Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మాయానగరంగా న్యూఢిల్లీ, ప్రతి 14 నిమిషాలకు ఓ కారు మాయం

car

ఐవీఆర్

, గురువారం, 14 మార్చి 2024 (23:33 IST)
దేశ రాజధాని న్యూఢిల్లీ మాయానగరంగా మారుతోంది. అక్కడ ప్రతి 14 నిమిషాలకు ఓ కారు దొంగతనం జరుగుతోంది. దేశంలో జరుగుతున్న కార్ల దొంగతనాల్లో 80 శాతం ఢిల్లీలోనే జరుగుతున్నాయంటే కారు దొంగలు ఇక్కడ ఏ స్థాయిలో వున్నదో అర్థం చేసుకోవచ్చు. అక్నో డిజిటిల్ ఇన్సూరెన్స్ వెల్లడించిన నివేదికలో ఈ విషయాలు వెలుగుచూసారు. ఢిల్లీలో తమ కారును అపహరించుకుపోయారంటూ పోలీసు స్టేషన్లలో ప్రతిరోజు ఫిర్యాదు చేస్తున్నవారి సంఖ్య 105గా వున్నట్లు తేలింది. ఈ కేసులను చూస్తే.. గత ఏడాది కంటే రెండున్నర రెట్లు మేర కారు దొంగతనాలు జరిగినట్లు తేలిందని చెబుతున్నారు.
 
ఢిల్లీ నగరం తర్వాత రెండో స్థానంలో చెన్నై మహానగరం ఆక్రమించింది. చెన్నైలో 2022లో జరిగిన కారు దొంగతనాలు 5 శాతం వుంటే ఇప్పుడది 10.5 శాతానికి... అంటే దాదాపు రెట్టింపు అయ్యింది. ఇక మూడోస్థానంలో బెంగళూరు వున్నది. ఐతే హైదరాబాద్, కోల్ కతా వంటి నగరాల్లో కారు దొంగతనాలు అంతగా లేకపోవడం చూస్తుంటే ఇక్కడ పోలీసు భద్రత కట్టుదిట్టంగా వున్నట్లు అర్థమవుతుంది.
 
దొంగిలించబడుతున్న కార్లలో అత్యధికంగా వేగనార్, మారుతి స్విఫ్ట్, మారుతి డిజైర్, హుండయ్ ఐటెన్ కార్లు అధికంగా వుంటున్నట్లు తేలింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గెలాక్సీ ఏ 55 5G, గెలాక్సీ ఏ 35 5Gలను ఆవిష్కరించిన శాంసంగ్