Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జయలలిత అప్పుడే చులకన అయిపోయారా? అమ్మ కంటే పైన చిన్నమ్మ బ్యానర్...

దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే పార్టీ అధినేత్రి జయలలిత మృతి చెందిన సంగతి తెలిసిందే. తమిళనాడు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్న జయలలితను అప్పుడే శశికళ గ్యాంగ్ చులకన చేసేసింది. అన్నాడీఎ

జయలలిత అప్పుడే చులకన అయిపోయారా? అమ్మ కంటే పైన చిన్నమ్మ బ్యానర్...
, గురువారం, 29 డిశెంబరు 2016 (13:59 IST)
దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే పార్టీ అధినేత్రి జయలలిత మృతి చెందిన సంగతి తెలిసిందే. తమిళనాడు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్న జయలలితను అప్పుడే శశికళ గ్యాంగ్ చులకన చేసేసింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా, తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన జయలలిత ఆకస్మికంగా మృతితో చిన్నమ్మ శశికళకు గురువారం పార్టీ పగ్గాలు అప్పగించాయి.
 
 గురువారం తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో పాటు పలువురు మంత్రులు పోయెస్ గార్డెన్ చేరుకుని అన్నాడీఎంకే పార్టీ శ్రేణులు ఈ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే చిన్నమ్మ శశికళ దగ్గరకు వెళ్లిన పార్టీ నాయకులను చూసిన కార్యకర్తలు షాకైయ్యారు. జయలలిత ఉన్న సమయంలో ఆమె దగ్గరకు వెళ్లి పలకరించాలన్నా, అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తగా గుర్తింపు తెచ్చుకోవాలన్నా నాయకులు వారి షర్టు జేబులో కచ్చితంగా అమ్మ జయలలిత ఫోటో పెట్టుకునేవారు. అది పార్టీ సాంప్రధాయంగా వచ్చేసింది.
 
గురువారం అన్నాడీఎంకే చీఫ్ గా పగ్గాలు చేపట్టిన తరువాత శశికళ దగ్గరకు వెళ్లిన నాయకుల జేబులో అమ్మ జయలలిత ఫోటో మాయమైపోయింది. చిన్నమ్మ ఫోటో వచ్చేసింది. అదేంటంటే? పార్టీ చీఫ్ ప్రస్తుతం చిన్నమ్మే కదా అంటూ చెప్తున్నారు. అంతేగాకుండా.. అమ్మ బ్యానర్లు చాలామటుకు కనుమరుగైనాయి.  చెన్నైలో కొన్ని చోట్ల అమ్మ ఫోటో కింద.. చిన్నమ్మ ఫోటో పైన గల బ్యాన్సర్లు వెలిశాయి. అయితే అమ్మను అప్పుడే చులకన చేసేసిన వైనం అన్నాడీఎంకే కార్యకర్తలకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2016లో టాలీవుడ్ టాప్ బిచ్చగాడు.. నాగార్జున, ఎన్టీఆర్‌, బన్నీలదే హవా.. 2017లో మాత్రం ఆ మూడు సినిమాలు?