Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కలియుగ ధర్మరాజు... పేకాటలో భార్యను పందెం కాసిన భర్త...

కలియుగ ధర్మరాజు... పేకాటలో భార్యను పందెం కాసిన భర్త...
, ఆదివారం, 22 సెప్టెంబరు 2019 (09:34 IST)
ఆ కాలంలో రాజ్యంతో పాటు కట్టుకున్న భార్యను జూదంలో పందెం కాసి ఓడిపోయాడు ధర్మరాజు. కౌరవులతో జరిగిన జూదంలో తమ భార్య ద్రౌపదిని ఒడ్డిన పాండువులు ఓటమి పాలవుతారు. ఓడిన పాండువులు నిస్సహాయంగా చూస్తుంటే ద్రౌపదిని నిండు సభలోకి లాక్కొచ్చిన దుర్యోధనుడి సోదరుడు దుశ్శాసనుడు ఆమెను వివస్త్రను చేసేందుకు ప్రయత్నిస్తాడు. అయితే, శ్రీకృష్ణుడి సాయంతో ఆమె ఆ గండం నుంచి బయటపడుతుంది. ఆ తర్వాత అది మహాభారత యుద్ధానికి దారితీసింది. 
 
ఇపుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ కలియుగ ధర్మరాజు ఉన్నాడు. ఆయన పేకాటలో తన భార్యను పందెం కాశాడు. ఆ పందెంలో ఓడిపోయాడు. దీంతో అతని భార్యను అతని కళ్లముందే అత్యాచారం చేసారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కళ్యాణ్‌పూర్‌ల జరిగిన ఓ ఘటన ఈ మహాభారత ఘట్టాన్ని మరోమారు గుర్తుకు తెచ్చింది. 
 
పోలీసుల కథనం మేరకు కళ్యాణ్ పూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి జూదం, మాదక ద్రవ్యాలకు బానిసగా మారాడు. ఈ నెల 15న తన ఇంట్లోనే స్నేహితులతో కలిసి పేకాట మొదలెట్టాడు. చేతిలోని డబ్బంతా అయిపోయింది. ఆడడానికి సొత్తు కనిపించలేదు. చుట్టూ చూస్తే భార్య కనిపించింది. వెంటన అతడి మదిలో చటుక్కున ఆలోచన మెరిసింది. వెంటనే భార్యను పందెం కాశాడు. ఆ ఆటలోనూ అతడు ఓటమి పాలయ్యాడు.
 
ఇక, స్నేహితుడి భార్యను గెలుచుకున్న మిగతా ఫ్రెండ్స్ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావించారు. స్నేహితుడి ముందే అతడి భార్యపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఓడిపోయి నిస్సహాయస్థితిలో ఉన్న భర్త వారి చెర నుంచి భార్యను రక్షించుకోలేకపోయాడు. అయితే, నిందితుల నుంచి ఎలాగోలా తప్పించుకుని బయటపడిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అయితే పోలీసులు మాత్రం నిందితులపై చర్యలు తీసుకోలేదు. ఇది భార్యాభర్తల గొడవంటూ చేదులుదులుపుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గోదావరి పడవ ప్రమాదం: బోటు డ్రైవర్లు బతికే ఉన్నారా?