Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యూపీలో ఘోరం : చాక్లెట్లు ఆరగించిన చిన్నారులు మృత్యువాత

Advertiesment
యూపీలో ఘోరం : చాక్లెట్లు ఆరగించిన చిన్నారులు మృత్యువాత
, బుధవారం, 23 మార్చి 2022 (20:13 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. చాక్లెట్లు ఆరగించిన చిన్నారులు మృత్యువాతపడ్డారు. ఓ ఇంటి ముందు ప్లాస్టిక్ బ్యాగులో ఉన్న చాక్లెట్లు ఉండగా, వాటిని ఓ మహిళ తీసి చిన్నారులకు ఇచ్చింది. ఆ చాక్లెట్లు ఆరగించిన వెంటనే చిన్నారులు స్పృహ కోల్పోవడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే, అక్కడ ముగ్గురు తోబుట్టు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఖుషీ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. మృతులను మంజన (3), స్వీటి (3), సమర్ (2), అరుణ్ (5)గా గుర్తించాపు. వీరీలో మంజన, స్వీటి, సమర్‌లు ఒకే తల్లి బిడ్డలు కావడం గమనార్హం. ఖుషీ నగర్‌లో జిల్లా కాశ్య ప్రాంతంలోని దిలీప్ నగర్‌లో ఉన్న ఓ ఇంటి ముందు లభ్యమైన ప్లాస్టిక్ బ్యాగులో ఉన్న చాక్లెట్లను ఓ మహిళ తన ముగ్గురు మనువళ్లు, పక్కింట్లో నివశించే మరో చిన్నారికి ఇవ్వగా వారంతా ప్రాణాలు కోల్పోయారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వృద్ధ కళాకారుల కోసం ముత్తూట్ ఫైనాన్స్ 'ఆర్థిక' అండ