Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమిత్‌షా అతిపెద్ద కసబ్.. మోడీ మిస్టర్ నెగటివ్ దళిత్ మ్యాన్: మాయావతి ఫైర్

కాంగ్రెస్+ ఎస్‌పి+బిఎస్‌పి కలిస్తే కసబ్ అంటూ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చేసిన విమర్శలపై బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరి కంటే కసబ్ అమిత్ షా అంటూ విమర్శలు గుప్పించారు. ఆయనకంటే అతి

అమిత్‌షా అతిపెద్ద కసబ్.. మోడీ మిస్టర్ నెగటివ్ దళిత్ మ్యాన్: మాయావతి ఫైర్
, శనివారం, 25 ఫిబ్రవరి 2017 (10:28 IST)
కాంగ్రెస్+ ఎస్‌పి+బిఎస్‌పి కలిస్తే కసబ్ అంటూ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చేసిన విమర్శలపై బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరి కంటే కసబ్ అమిత్ షా అంటూ విమర్శలు గుప్పించారు. ఆయనకంటే అతిపెద్ద ఉగ్రవాది మరొకరు లేరనే విషయం యావత్ దేశ ప్రజలకు తెలుసునని ఎద్దేవా చేశారు. 
 
కాగా యూపీలో కొంత కాలంగా కసబ్ (కాంగ్రెస్+ఎస్‌పి+బిఎస్‌పి) పాలన కొనసాగుతోందని, దీంతో రాష్ట్రంలో అభివృద్ధి పూర్తింగా కుంటుపడిందని అమిత్ షా వ్యాఖ్యానించారు. అదే విధంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మొదటిసారిగా యూపీలో నిర్వహించిన తొలి ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ సమాజ్‌వాది, కాంగ్రెస్, అఖిలేశ్, మాయావతిలను ‘స్కామ్’ (ఎస్‌సిఎఎం)గా అభివర్ణించారు. బిఎస్‌పి అంటే ‘బెహన్‌జీ సంపత్తి పార్టీ’గా అని ఆయన పేర్కొన్నారు. 
 
అయితే అమిత్ షా వ్యాఖ్యలను తిప్పికొట్టినట్లే.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యలను కూడా మాయావతి తోసిపుచ్చారు. బీజేపీ అంటే ‘భారతీయ జుమ్లా పార్టీ’ అని ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీ పేరును ‘మిస్టర్ నెగటివ్ దళిత్ మ్యాన్’గా అభివర్ణించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అల్ బాబ్ నగరంపై రెచ్చిపోయిన ఐసిస్.. 60మంది మృతి..!