Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేంద్ర మంత్రి హర్షవర్థన్‌కు అరుదైన గౌరవం - డబ్ల్యూహెచ్‌వో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా...

Advertiesment
Harsh Vardhan
, బుధవారం, 20 మే 2020 (17:41 IST)
కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి హర్ష వర్థన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ ఆరోగ్యం సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా ఆయన నియమితులయ్యారు. ఫలితంగా శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. 
 
మొత్తం 194 సభ్య దేశాలున్న డబ్ల్యూహెచ్ఓ మంగళవారం సమావేశంకాగా, ఇందులో ఎగ్జిక్యూటివ్ బోర్డుకు భారత్‌ను ఎన్నుకున్నారు. దీంతో ఇప్పటివరకు ఎగ్జిక్యూటివ్ బోర్డు ఛైర్మన్‌గా ఉన్న జపాన్‌కు చెందిన డాక్టర్ హిరోకి  నకటాని స్థానంలో హర్షవర్ధన్ బాధ్యతలను స్వీకరించనున్నారు.
 
ఈ నెల 22వ తేదీన జరగనున్న బోర్డు మీటింగ్‌లో హర్షవర్ధన్ బాధ్యతలను స్వీకరిస్తారు. అయితే బోర్డు ఛైర్మన్ అనేది పూర్తి కాలం ఉండే బాధ్యత కాదు. కేవలం బోర్డు సమావేశాలకు మాత్రమే హాజరు కావాల్సి ఉంటుంది. బోర్టు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పదవీకాలం మూడేళ్లుగా ఉంటుంది. యేడాదికి రెండు సార్లు బోర్డు సమావేశాలు జరుగుతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుక్కలు మొరిగాయని వాటి యజమాని పళ్లూడగొట్టాడు