Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జూలై నుంచి కాకుండా సెప్టెంబర్ నుంచి కాలేజీలను ప్రారంభించాలి

Advertiesment
UGC
, శనివారం, 25 ఏప్రియల్ 2020 (16:28 IST)
కరోనా మహమ్మారి కారణంగా కొత్త విద్యా సంవత్సరాన్ని ఎప్పటిలా జూలై నుంచి కాకుండా సెప్టెంబర్ నుంచి ప్రారంభించాలని యూనివ‌ర్సిటీ గ్రాంట్స్ క‌మిష‌న్ ప్ర‌తిపాద‌న‌లు చేసింది. కరోనా కారణంగా మార్చి నెల నుంచే కాలేజీలు, సూళ్లు మూతపడిన సంగతి తెలిసిందే. తాజాగా కోవిడ్‌19 నేప‌థ్యంలో కాలేజీల అంశాన్ని స్ట‌డీ చేసేందుకు యూజీసీ రెండు క‌మిటీల‌ను వేసింది. 
 
విద్యా సంవ‌త్స‌రం న‌ష్టంతో పాటు ఆన్‌లైన్ విద్య గురించి ఆ క‌మిటీలు స్ట‌డీ చేశాయి. హ‌ర్యానా వ‌ర్సిటీ వీసీ ఆర్‌సీ కుహ‌ద్ నేతృత్వంలో ఓ క‌మిటీ వ‌ర్స‌టీ ప‌రీక్ష‌ల గురించి అధ్య‌య‌నం చేసింది. 
 
ఇగ్నో వీసీ నాగేశ్వ‌ర‌రావు ఆధ్వ‌ర్యంలో మ‌రో క‌మిటీ ఆన్‌లైన్ ప‌రీక్ష‌ల గురించి రిపోర్ట్ త‌యారు చేసింది. అయితే రెండు క‌మిటీలు శుక్ర‌వారం యూజీసీకి నివేదిక‌లు అందించాయి. దాంట్లో ఓ క‌మిటీ.. అకాడ‌మిక్ సంవ‌త్స‌రాన్ని జూలైకి బ‌దులుగా సెప్టెంబ‌ర్ నుంచి స్టార్ట్ చేయాల‌ని సూచించింది. 
 
ఒక‌వేళ వ‌ర్సిటీల్లో కావాల్సినంత మౌళిక స‌దుపాయాలు ఉంటే, వారు ఆన్‌లైన్ ప‌రీక్ష‌లు చేప‌ట్ట‌వ‌చ్చు అని మ‌రో క‌మిటీ సూచించింది. మాన‌వ‌వ‌న‌రుల మంత్రిత్వ‌శాఖ ఆ రెండు క‌మిటీ నివేదిక‌ల‌ను ప‌రిశీలిస్తున్న‌ది. మ‌రో వారం రోజుల్లోగా దీనిపై ప్ర‌భుత్వం త‌మ నిర్ణ‌యాన్ని వెల్ల‌డిస్తుందని తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీకాకుళంలో అడుగుపెట్టిన కరోనా వైరస్ - 3 కరోనా పాజిటివ్ కేసులు