Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీహార్‌ లో బీఎస్పీకి గట్టి ఎదురుదెబ్బ

బీహార్‌ లో బీఎస్పీకి గట్టి ఎదురుదెబ్బ
, సోమవారం, 5 అక్టోబరు 2020 (07:01 IST)
బీహార్‌ ఎన్నికల వేళ మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీఎస్పీ బీహార్‌ అధ్యక్షుడు భారత్‌ బింద్‌ ఆర్జేడీలో చేరారు.

లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు తేజస్వి యాదవ్‌ సమక్షంలో ఆయన ఆర్జేడీ కండువా కప్పుకున్నారు. తేజస్వి చేతుల మీదుగా పార్టీ సభ్యత్వాన్ని అందుకున్నారు. ఈ విషయాన్ని తేజస్వి తన ట్విట్టర్‌లో స్వయంగా పోస్టు చేశారు.

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు తమ పార్టీలో చేరారని, ఆయన చేరిక ప్రజా వ్యతిరేక విధానాలతో పాలన సాగిస్తున్న ఎన్‌డీఏకి వ్యతిరేకంగా తాము చేస్తున్న పోరాటానికి గట్టి మద్దతు లభించినట్టుగా పేర్కొన్నారు.

ఇదిలాఉండగా బీఎస్పీ రాష్ట్రంలోని ఆర్‌ఎల్‌ఎస్పీతో కలసి ఎన్నికల బరిలో నిలువనున్నట్టు మాయావతి ఇటీవల వెల్లడించారు. తమ కూటమి తరపున కేంద్రమాజీ మంత్రి ఉపేంద్ర కుష్వాహాను సీఎం అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్టోబర్‌ 16న కనకదుర్గ ఫ్లైఓవర్‌ ప్రారంభం