Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాలిక అన్న వాహికలో ఐదు రూపాయల నాణేం.. ఎలా తొలగించారంటే?

Five rupees coin

సెల్వి

, శనివారం, 24 ఆగస్టు 2024 (10:48 IST)
తమిళనాడు, తిరుచ్చి మహాత్మాగాంధీ స్మారక ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యుల బృందం గురువారం తొట్టియమ్‌కు చెందిన ఏడేళ్ల బాలిక ఎగువ అన్నవాహిక నుండి ఐదు రూపాయల నాణేన్ని తొలగించారు. ఐదు రూపాయల కాయిన్‌ను ప్రమాదవశాత్తు దానిని మింగేయడంతో బాలికను ఆస్పత్రిలో చేర్చారు. 
 
తొలుత ముసిరి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లిన బాలిక, అక్కడ నుంచి ఆమె తిరుచ్చి మహాత్మాగాంధీ స్మారక ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. అక్కడ పరీక్షలో ఓ కాయిన్ ఆమె ఎగువ అన్నవాహికలో వున్నట్లు గుర్తించారు. 
 
దీంతో సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగానికి చెందిన డాక్టర్ కన్నన్ నేతృత్వంలోని వైద్యుల బృందం వెంటనే ఎండోస్కోపీని నిర్వహించి బాలిక ఆహార పైపు కింది భాగం నుంచి ఆ నాణేన్ని తొలగించింది. 
 
"వేగవంతమైన చర్యతో, మా వైద్య బృందం గుండెపోటును నిరోధించింది. ఎండోస్కోపీ పద్ధతిని ఉపయోగించి, మేము మూడు గంటల వ్యవధిలో నాణేన్ని తొలగించాము" అని డాక్టర్ కన్నన్ తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్రైనీ డాక్టర్ అత్యాచారం.. నా కొడుకు బంగారం అంటోన్న తల్లి