Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిల్లు కట్టలేదని బెడ్‌కే కట్టేశారు, మధ్యప్రదేశ్ ఆసుపత్రిలో దారుణం

Advertiesment
Madhya Pradesh
, సోమవారం, 8 జూన్ 2020 (09:33 IST)
ప్రైవేటు ఆసుపత్రుల అఘాయిత్యం మరోమారు బట్టబయలైంది. ఫీజుల కోసం ఎంతకైనా దిగజారే కొన్ని ఆసుపత్రుల రాక్షసత్వం బాహ్య ప్రపంచానికి మరొక్కమారు తెలిసొచ్చింది.
 
చికిత్స అనంతరం బిల్లు చెల్లించలేదని ఒక వృద్ధుడిని వైద్యులు బెడ్‌కు కట్టేసిన ఘటన మధ్యప్రదేశ్‌లోని షాజ్‌పూర్‌ జిల్లాలో జరిగింది. రూ. 11వేలు చెల్లించకపోవడంతో అతని కాళ్లు, చేతులు కట్టేశారని వృద్ధుని కుమార్తె తెలిపింది.

ఆస్పత్రిలో అడ్మిట్‌ అయినపుడు రూ. 5 వేలు బిల్లు చెల్లించామని, అయితే పరిస్థితి తీవ్రంగా ఉండటంతో మరికొన్ని రోజులు ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చిందని, దీంతో బిల్లు ఎక్కువైందని, అంత డబ్బు చెల్లించలేమని చెప్పామని ఆమె పేర్కొంది.

మొత్తం నగదు చెల్లించాల్సిందేనంటూ వైద్యులు వృద్ధుడిని మంచానికి కట్టేశారని వాపోయింది. అయితే వృద్ధునికి మూర్చ ఉన్నందునే ఆ విధంగా మంచానికి కట్టేశామంటూ ఆస్పత్రి వర్గాలు వెల్లడించడం గమనార్హం.

ఈ ఘటనపై మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ స్పందించారు. షాజ్‌పూర్‌లో ఉన్న ఆస్పత్రి వర్గాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, దర్యాప్తుకు ఆదేశించామని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హోటళ్లు తెరవాలంటే ఈ సూచనలు పాటించాల్సిందే: భారత ప్రభుత్వం