Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

50 కిలోమీటర్లు.. పది గంటలు.. తల్లి మృతదేహంతో జవాను నడక..

దేశరక్షణ కోసం పాటుపడే ఓ వీర జవానుకు చేదు అనుభవం మిగిలింది. పఠాన్ కోట్‌లో జవానుగా పనిచేస్తున్న మహ్మద్ అబ్బాస్ తల్లి నాలుగు రోజుల క్రితం మరణించింది. మాతృమూర్తికి సొంతూరైన కర్మాలోనే అంత్యక్రియలు నిర్వర్త

50 కిలోమీటర్లు.. పది గంటలు.. తల్లి మృతదేహంతో జవాను నడక..
, శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (09:14 IST)
దేశరక్షణ కోసం పాటుపడే ఓ వీర జవానుకు చేదు అనుభవం మిగిలింది. పఠాన్ కోట్‌లో జవానుగా పనిచేస్తున్న మహ్మద్ అబ్బాస్ తల్లి నాలుగు రోజుల క్రితం మరణించింది. మాతృమూర్తికి సొంతూరైన కర్మాలోనే అంత్యక్రియలు నిర్వర్తించాలనేది అబ్బాస్‌ కోరిక. కానీ అక్కడ అంత్యక్రియలు నిర్వహించాలంటే.. 50 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఏదైనా వాహనంలో వెళ్దామనుకుంటే వాతావరణం సహకరించదు. రోడ్డుపై ఆరు అడుగుల మేర మంచు పేరుకుపోయింది. 
 
ఇక చేసేది లేక మృతదేహాన్ని తరలించేందుకు హెలికాప్టర్ సిద్ధం చేస్తామని కుప్వారా జిల్లా అధికారులు మాటిచ్చారు. నాలుగు రోజులైనా దాని జాడ లేకపోవడంతో తల్లి మృతదేహాన్ని భుజానేసుకొని సొంతూరుకు బయలు దేరాడు. పదిగంటలు నడిచి అక్కడికి చేరుకున్నాడు.
 
అధికారుల తీరుతో తన తల్లికి సరైన రీతిలో అంత్యక్రియలు నిర్వహించలేకపోయానని అబ్బాస్‌ విలపించాడు. అయితే.. హెలికాప్టర్‌ను సిద్ధం చేశామని, వాతావరణం సరిగా లేకపోవడంతో సాయం పొందేందుకు అబ్బాస్‌ కుటుంబ సభ్యులు తిరస్కరించారని అంటున్నారు. కానీ వాదనను అబ్బాస్ కొట్టిపారేశాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్ళికి అంతా సిద్ధం.. తాళికట్టాల్సిందే తరువాయి.. వరుడు జంప్.. ఎందుకంటే?