Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాహుల్ గాంధీపై సెటైర్లు.. మోడీనే టార్గెట్.. రమ్యను అస్త్రంగా తీసుకున్న సోనియా..!

సోషల్ మీడియా రాహుల్ గాంధీపై వస్తోన్న సెటైర్లకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చర్యలు చేపడుతుతున్నారు. డిజిటల్ ప్రచారాలకు.. వ్యవహారాలు పర్యవేక్షించేందుకు కర్ణాటక సినీ నటి, మా

రాహుల్ గాంధీపై సెటైర్లు.. మోడీనే టార్గెట్.. రమ్యను అస్త్రంగా తీసుకున్న సోనియా..!
, శనివారం, 13 మే 2017 (10:46 IST)
సోషల్ మీడియా రాహుల్ గాంధీపై వస్తోన్న సెటైర్లకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చర్యలు చేపడుతుతున్నారు. డిజిటల్ ప్రచారాలకు.. వ్యవహారాలు పర్యవేక్షించేందుకు కర్ణాటక సినీ నటి, మాజీ ఎంపీ కూడా అయిన రమ్యను రాహుల్ ఎంపిక చేసినట్లు సమాచారం.
 
డిజిటల్ క్యాంపెయిన్ చేయడంలో రమ్య సమర్థంగా వ్యవహరించిన సందర్భాలున్న నేపథ్యంలో రాహుల్, రమ్య వైపే మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని టార్గెట్‌గా రమ్య ఇకపై అస్త్రాలు సిద్ధం చేసుకుని.. డిజిటల్ మీడియా వదులుతుందన్నమాట.
 
దేశంలో ప్రతి నగరంలో వేలాదిమంది ఇంటర్నెట్ కూలీలను పెట్టుకున్న బీజేపీ.. రాహుల్ గాంధీలపై తప్పుడు సమాచారం ఇస్తూ వారిని బఫూన్లుగా చిత్రీకరిస్తోందని సోనియా గాంధీ బాధపడుతోంది. సోషల్ మీడియాలో లేనిపోని ఆరోపణలు చేస్తూ, రాహుల్ ఖ్యాతిని తక్కువచేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని.. దీనిని ధీటుగా ఎదుర్కోవాలని సోనియా గాంధీ కాంగ్రెస్ వర్గాలను ఆదేశించినట్లు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కెసిఆర్, జగన్ బీజేపీకి ఎలా లొంగిపోయారు? ఎంత ఒత్తిడి ఫలితమో ఇది!