Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

4 నెలలుగా సీనియర్ల ర్యాగింగ్ - రెండో అంతస్తు నుంచి దూకిన విద్యార్థి

Assam Ragging
, మంగళవారం, 29 నవంబరు 2022 (08:34 IST)
అస్సాం రాష్ట్రంలోని దిబ్రూగఢ్ విశ్వవిద్యాలయంలో ఓ దారుణం జరిగింది. నాలుగు నెలలుగా ర్యాగింగ్ చేస్తున్న సీనియర్ విద్యార్థుల బారి నుంచి తప్పించుకునేందుకు ఓ విద్యార్థి హాస్టల్ భవనం రెండో అంతస్తు నుంచి కిందికి దూకేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ విద్యార్థి ఇపుడు ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధిత విద్యార్థి పేరు ఆనంద్ శర్మ. 
 
ఆనంద్ శర్మ దిబ్రూగఢ్ యూనివర్శిటీలో విద్యాభ్యాసం చేస్తున్నాడు. అయితే, గత నాలుగు నెలలుగా సీనియర్ విద్యార్థులు అతని ర్యాగింగ్ చేస్తున్నారు. ఇవి రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ వేధింపులకు భయపడిన ఆ విద్యార్థి సీనియర్ల బారి నుంచి తప్పించుకునేందుకు హాస్టల్ భవనంలోని రెండో అంతస్తు నుంచి కిందికి దూకేశాడు. ఈఘటనలో తీవ్ర గాయాలపాలైన ఆనంద్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. 
 
ఈ ఘటనపై ఆనంద్ శర్మ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆనంద్‌ను ర్యాగింగ్ చేసిన ఐదుగురు సీనియర్ విద్యార్థులను అరెస్టు చేశారు. వీరు గత నాలుగు నెలలుగా శారీరకంగా, మానసికంగా వేధించినట్టు వారు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పైగా, తన కుమాడి నుంచి డబ్బులు, మొబైల్ ఫోన్ లాక్కుని హింసించేవారని, మద్యం తాగించి అభ్యంతరకరమైన ఫోటోలను తీసేవారని, ఆపై వాటిని సోషల్ మీడియాలో పెడతామని బెదిరించే వారని ఆనంద్ శర్మ పేర్కొన్నారు. 
 
దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురు విద్యార్థులను అరెస్టు చేశారు. వీరిలో రాహుల్ చైత్రీ అనే మాజీ విద్యార్థి కూడా ఉన్నాడు. నేర పూరిత కుట్ర, ఓ వ్యక్తిని అన్యాయంగా అడ్డుకోవడం, దోపిడీకి పాల్పడటం, హత్యాయత్నం, చట్టవిరుద్ధంగా సమావేశం కావడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ మకర సంక్రాంతి వేళ మీ ఇంటికి పండుగ వైభవం అందించండి