Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బెంగళూరులో దారుణం.. కుమార్తెను హత్య చేసిన టెక్కీ.. కారణం?

crime scene
, సోమవారం, 28 నవంబరు 2022 (12:03 IST)
బెంగళూరులో దారుణం జరిగింది. ఉద్యోగం ఊడిపోవడంతో ఓ టెక్కీ తన కుమార్తెను హత్య చేసుకున్నాడు. రెండేళ్ల వయస్సున్న కుమార్తెకు తిండి పెట్టేందుకు డబ్బులేదని.. కుమార్తెను చంపేశాడు. ఆపై ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌కు చెందిన రాహుల్ భార్యాపిల్లలతో కలిసి బెంగళూరులో వుంటున్నాడు. ఆరు నెలల క్రితం రాహుల్‌కు ఉద్యోగం ఊడిపోయింది. 
 
ఇటు బిట్ కాయిన్ బిజినెస్ లోనూ నష్టమొచ్చింది. దీంతో అప్పులపాలైన రాహుల్ తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. మూడు రోజుల క్రితం కూతురుతో కలిసి బయటకు వెళ్లిన రాహుల్.. తిరిగి రాలేదని ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఆపై సిటీ శివార్లలోని ఓ చెరువు దగ్గర రాహుల్ కారు కనిపించింది. ఆ చెరువులో రాహుల్ కూతురు మృతదేహం బయటపడింది.
 
విచారణలో రాహుల్ తన కూతురును చంపేసినట్లు తేలింది. డబ్బులేకపోవడంతో కూతురుకు తిండిపెట్టలేనని భావించి హత్యకు పాల్పడినట్లు రాహుల్ చెప్పినట్లు పోలీసులు వివరించారు. తనూ ఆత్మహత్యకు ప్రయత్నించినా విఫలమైనట్లు తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధరణి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కలెక్టర్లతో సీఎం సమావేశం