Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..13 మంది దుర్మరణం

పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..13 మంది దుర్మరణం
, బుధవారం, 20 జనవరి 2021 (13:58 IST)
పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జల్పాయి గురి జిల్లాలోని దుప్‌గురి నగరంలో బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో 13 మంది దుర్మరణం చెందగా..మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు.

పొగ మంచు కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు భావిస్తున్నారు. బండ రాళ్ల లోడుతో వెళ్తున్న ట్రక్కు డ్రైవర్‌...నియంత్రణ కోల్పోవడంతో.. ఢీవైడర్‌ను తాకి..అటుగా వస్తున్న రెండు వాహనాలను బలంగా ఢీ కొట్టడంతో ఈ ఘోరం సంభవించిందని పోలీసులు తెలిపారు.

దీంతో ఆ రాళ్లు కూడా వాహనాలపై పడ్డాయని చెప్పారు. ట్రక్కుకు ముందు వైపు ఉన్న మరో లారీ కూడా దెబ్బతిందని, మొత్తంగా నాలుగు వాహనాలు ధ్వంసమయ్యాయని వెల్లడించారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇక రైళ్లలోనూ రెడీ టూ ఈట్‌ మీల్స్‌ సదుపాయం!