Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లతా మంగేష్కర్ రూ.200 కోట్ల ఆస్తి ఎవరికి?

Advertiesment
Lata Mangeshkar
, మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (16:38 IST)
ఇటీవల తరలిరాని లోకాలకు చేరుకున్న 'గాన కోకిల' లతా మంగేష్కర్‌కు దాదాపు 200 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తిపాస్తులు ఉన్నాయి. తన జీవితాంతం ఒంటరిగానే ఆమె జీవించారు. ఇపుడు ఆమెకు చెందిన ఆస్తి ఎవరికి చెందుతున్న చర్చ మొదలైంది.
 
జీవితాంతం బ్రహ్మచారిణిగా ఉన్న లతా మంగేష్కర్.. పెళ్లి చేసుకోలేదు కదా ఎవరినీ కూడా దత్తత తీసుకోలేదు. దీంతో ఆమె ఆస్తిపాస్తులకు సంబంధించిన వీలునామాలో ఆస్తులను ఎవరి పేరిట రాశారనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే, ఈ విషయంలో కొన్ని రోజుల్లో ఆమె న్యాయవాది ఓ క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
అయితే, లతా మంగేష్కర్ జీవించివున్న సమయంలో ఒక చారిటబుల్ ట్రస్ట్‌ను నిర్వహిస్తూ వచ్చారు. ఇపుడు ఆమె ఆస్తులు కూడా ఆ ట్రస్ట్‌కే దక్కుతాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. అదేసమయంలో లతా మంగేష్కర్‌కు ఇద్దరు తోబుట్టువులు, ఓ సోదరుడు ఉన్నారు. అందువల్ల ఈ ఆస్తుల వీలునామాలో వీరి పేర్లను ఏమైనా రాశారా అనేది కూడా తెలియాల్సివుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ సీఎం జగన్‌కు హైకోర్టు ఉద్యోగుల లేఖ.. అందులో ఏముందంటే...