Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణలో మొదలై.. ముంబైలో పెళ్ళిపీటలెక్కి.. విషాదం మిగిల్చిన ప్రేమకథ..

తెలంగాణలో ఓ ప్రేమకథ విషాదాంతమైంది. తెలంగాణలోని ఓ కాలేజీలో మొదలైన ఈ ప్రేమకథ.. ముంబైలో పెళ్ళి పీటలెక్కినప్పటికీ.. కోర్టు ఆదేశాలతో కోర్టు ముందు ప్రవేశపెట్టే లోపే విషాదం మిగిల్చింది. కోర్టులో ప్రవేశపెడతార

Advertiesment
తెలంగాణలో మొదలై.. ముంబైలో పెళ్ళిపీటలెక్కి.. విషాదం మిగిల్చిన ప్రేమకథ..
, బుధవారం, 17 మే 2017 (19:22 IST)
తెలంగాణలో ఓ ప్రేమకథ విషాదాంతమైంది. తెలంగాణలోని ఓ కాలేజీలో మొదలైన ఈ ప్రేమకథ.. ముంబైలో పెళ్ళి పీటలెక్కినప్పటికీ.. కోర్టు ఆదేశాలతో కోర్టు ముందు ప్రవేశపెట్టే లోపే విషాదం మిగిల్చింది. కోర్టులో ప్రవేశపెడతారనే అవమానంతో 20 గంటల ముందు యువతి ఆత్మహత్య చేసుకోగా, ఆ యువకుడి పరిస్థితి ఏంటో తెలియరాలేదు. అతను ఎక్కడున్నాడో వివరాలు తెలియలేదు. 
 
వివరాల్లోకి వెళితే.. అంబోజి నరేష్, తుమ్మల స్వాతిలు కాలేజీలో చదువుకుంటున్న సమయంలో ప్రేమలో పడి, ఈ సంవత్సరం మార్చి 25న వివాహం చేసుకుని ముంబైలో కాపురం పెట్టారు. నరేష్‌తో పోలిస్తే, స్వాతి అగ్రవర్ణాలకు చెందిన అమ్మాయి కావడంతో, ఆమె తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో స్వాతి, నరేష్‌తో కలసి వెళ్లిపోయింది.
 
ఆపై స్వాతి ఎక్కడున్నారో కనుగొన్న ఆమె తల్లిదండ్రులు ఇంటికి రమ్మని పిలిపించి.. ఆమెను తీసుకెళ్లిపోయారు. నరేశ్ అదృశ్యమయ్యాడు. అయితే ఇంతలో ఏమైందో ఏమో కానీ స్వాతి ఆత్మహత్యకు పాల్పడింది. నరేష్ ఆచూకీ తెలియరాలేదు. ఈ కేసుపై లోతుగా విచారించాలని కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రివాల్వర్ రాణి.. వరుడి తలకు గురిపెట్టింది.. స్కార్పియోలో కిడ్నాప్ చేసుకెళ్లింది..