Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎంకే స్టాలిన్ పూర్వీకులు తెలుగువారా? తెరపైకి సరికొత్త చర్చ!

Advertiesment
Tamil Nadu
, ఆదివారం, 9 మే 2021 (13:50 IST)
తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంకే స్టాలిన్ ఇటీవలే బాధ్యతలు స్వీకరించార. ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో డీఎంకే ఒంటరిగా 125 సీట్లలో విజయం సాధించింది. దీంతో మిత్రపక్షాల సహాయం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, స్టాలిన్ పూర్వీకులు తెలుగువారనే చర్చ ఇపుడు తెరపైకివచ్చింది. 
 
స్టాలిన్ పూర్వీకులను ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. స్టాలిన్‌ తండ్రి కరుణానిధి తల్లిదండ్రులు ప్రకాశం జిల్లాకు చెందినవారేనట. కరుణానిధి మద్రాస్ ప్రెసిడెన్సీలో తిరువారూర్ జిల్లాలోని తిరుక్కువళైలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు తెలుగువారు. ఆయన మాతృభాష తెలుగు.
 
ముత్తువేలు, అంజు దంపతులకు 1924 జూన్ 3వ తేదీన జన్మించన కరుణానిధికి తల్లిదండ్రులు పెట్టిన అసలు పేరు దక్షిణామూర్తి. కరుణానిధి పూర్వీకులది నిజానికి విజయనగరం జిల్లా. జీవనోపాధి కోసం ఒంగోలు ప్రాంతానికి వలస వచ్చిన కరుణ పూర్వీకులు ఇక్కడ పెళ్లూరు సంస్థానాన్ని పరిపాలించిన వెంకటగిరి మహారాజా ఆస్థానంలో చేరారు
 
వాయిద్య కళాకారులుగా ప్రతిభ చూపిస్తూ వెంకటగిరి మహారాజు వద్ద పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు ఒంగోలు శివారు లోని పెళ్లూరు గ్రామంలో ఉన్న శివాలయంలో వీరు మంగళవాయిద్యాలు వాయించేవారు. అలా నాయిబ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కరుణానిధి పూర్వీకులు ఐదు కుటుంబాలు ఇక్కడ స్థిరపడ్డారు. 
 
వీరి కుటుంబం నివసించడానికి చెరువుకొమ్ముపాలెం గ్రామంలో నివాస స్థలాలు కేటాయించారు మహరాజావారు అంతేగాక వీరికి దాదాపు 150 ఎకరాల భూమిని మాన్యంగా కేటాయించారు. ఆభూములను సాగుచేసుకుంటూ, దేవాస్థానం ఆస్థాన విద్వాంసులుగా కూడా చాలాకాలం పనిచేశారు.
 
అయితే, కరువు కాటకాలు రావడం, పంటలు పండకపోవడంతో జీవనం కష్టమైంది. దీంతో కరుణానిధి పూర్వీకులు ఇక్కడి భూములను విక్రయించి, తమిళనాడులోని తంజావూరు ప్రాంతానికి వలస వెళ్లినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ విషయాలను కరుణానిధే స్వయంగా చెప్పినట్లు వారు గుర్తుచేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లాక్డౌన్‌తో కరోనాకు కట్టు : 17 వరకు పొడగిస్తున్నాం : అరవింద్ కేజ్రీవాల్